చంద్రబాబు చేసిన తప్పులకి తగిన శిక్ష పడిందని ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై వారు మీడియాతో మాట్లాడారు..
సిఐడి అడిషనల్ డిజి సంజెయ్ పూర్తి సమాచారంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. ఏ ఆదారాలు లేకుండా సిఐడి వాళ్లు ఎందుకు అరెస్టు చేస్తారు? అన్ని ఆధారాలు సేకరించే సిఐడి వాళ్లు అడుగు ముందుకేశారని అన్నారు.
రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించామని కొందరంటున్నారు. చేసిన స్కాం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు…. ఏపి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాకే చంద్రబాబు అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారని మంత్రులు అన్నారు.
రూ. 371 కోట్ల విలువైన ఈ స్కామ్ లో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు,ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించారు. వారినుంచి పూర్తి సాక్ష్యం తీసుకున్నాకే చంద్రబాబు ను అరెస్టు చేశారని వారన్నారు.ఐటీ అధికారులు నోటీసులిస్తే.. ఆసర్కిల్ వారికి నోటీసు ఇచ్చే అధికారం లేదంటూ అడ్డగోలు వాదనలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. టీడీపీ తొత్తులను వెంట పెట్టుకుని సీఐడీనే చంద్రబాబు నిలదీశారని ఎల్లోమీడియా ప్రచారం చేసుకుందని మండిపడ్డారు.ఓటుకు నోటు కేసులో కూడా అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు. మరి ఇప్పుడు ఎంత రచ్చ చేస్తాన్నారో తెలిసిందేగా అన్నారు . ఇన్నర్ రింగ్ రోడ్, ఏపి ఫైబర్ నెట్ లో కూడా అవకతవకలు జరిగాయి… అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారని మంత్రులు తెలిపారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఇప్పటికే సీమెన్స్, డిజిటెక్, స్కిల్లెర్ కంపెనీల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు చివరకి ఆఖరు వంతుగా మాత్రమే స్కాం లీడర్ చంద్రబాబు దొరికారు అని మాట్లాడారు.ఇది చంద్రబాబు స్వయంగా చేసిన స్కాం కాబట్టే… అయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేకపోతున్నారని అన్నారు.ఆధారాలు ఉన్నాయి అని తెలిసి కూడా కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారు అని జోగి రమేష్ అన్నారు.
స్కామ్ జరిగింది ఇలా…
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలు సీమెన్స్, డిజైన్ టెక్ ..కాగా ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మున కాజేసేందుకు పదుల సంఖ్యలో షెల్ కంపెనీలను సృష్టించారు.ఒక కంపెనీనుంచి మరో కంపెనీకి సొమ్మును బదలాయించే విధంగా ఏర్పాట్లు చేసుకుని ప్రభుత్వ సొమ్ము మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. అసలు ఈ ప్రాజెక్టుకు ఉపయోగపడేవి కాని కంపెనీలకు సొమ్ము మళ్లించినట్లు అయ్యింది.అంటే ఇవి కేవలం డబ్బును మళ్లించుకోడం ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీలని తేలిపోయింది.ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు కనుసన్నల్లోనే, తెలిసే జరిగిందన్నది వైసీపీ మంత్రులు చేస్తున్న ఆరోపణ.
పుంగనూరు ఘటనలోనూ ఇదే తీరు…
బస్సు యాత్ర సమయంలో చంద్రబా రూట్ మ్యాప్ మార్చి పుంగనూరు లోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే….. పోలీసులు అడ్డుకున్నారు.అప్పడే పుంగనూరులో అల్లర్ల చేలరేగాయి. కానీ అల్లర్లు చేసింది వైసీపీ నేతలు అని ముద్ర వేశారు కానీ అక్కడ ఒక్క వైసీపీ కార్యకర్త కూడా లేరు అని తెలియజేశారు పెద్దిరెడ్డి.