ACB కోర్టు
నేను నిప్పు నేను నిప్పు.. నా 40 ఏళ్ల స్వచ్ఛమైన రాజకీయ జీవితం క్లీన్ .. నా జీవితం తెరచిన పుస్తకం అంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన చంద్రబాబు కెరీర్ పై తొలిసారి అవినీతి ముద్ర పడింది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ACB కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు ఏసీబీ కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి కేసులో కీలకంగా మారిన 409 సెక్షన్, 17(ఎ) సెక్షన్లు చంద్రబాబుకు వర్తిస్తాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి ముందు గవర్నర్ కు సమాచారం ఇవ్వాలని నిబంధనలు అతిక్రమించారనీ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఏసీబీ కోర్టు కొట్టేసింది. చంద్రబాబు ప్రస్తుతానికి ఎమ్మెల్యే మాత్రమేనని అందువల్ల ఆయన అరెస్టుకు సంబంధించి స్పీకర్ కు ముందుగా సమాచారం ఇచ్చామనీ సిఐడి అధికారులు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నేర పూరిత కు ట్రకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని జడ్జి తెలిపారు.
ACB కోర్టు
అంతకుముందు చంద్రబాబు తరపున ప్రముఖ ఢిల్లీ న్యాయవాది సిద్ధార్ధ్ లుధ్రా వాదించారు. చంద్రబాబుపై ఈ కేసు చెల్లనేరదని గట్టిగా వాదించారు. ఆయనపై కేసును కొట్టేయాలని, కీలకంగా మారిన 409, సెక్షన్ 17 (ఎ) చంద్రబాబుకు వర్తించవని వాదించారు. చంద్రబాబుపై కేసును కొట్టేస్తారని టీడీపీ తరపు లాయర్లు, పార్టీనేతలు, కుటుంబ సభ్యులు ధీమాగా ఉండగా.. తీర్పు భిన్నంగా వెలువడటంతో టీడీపీ నేతల్లో నిరాశ కనిపించింది. అంతకుముందు ఉదయం ఆరింటినుంచే ఏసీబీ కోర్టు ముందు హంగామా కనిపించింది.రాత్రంతా చంద్రబాబు సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిపుణులతో కూడిన వైద్య బృందం పర్యవేక్షిస్తూ వచ్చింది.
శనివారం రాత్రి నుంచే… ACB కోర్టు
అంతకుముందు శనివారం రాత్రి నుంచి సిట్ కార్యాలయం ముందు, ACB ముందు హడావుడి కనిపించింది. చంద్రబాబును అరెస్టు చేస్తే ఊరుకోబోమంటూ పార్టీ శ్రేణులు అడ్డుపడ్డాయి. రాత్రంతా ఆయన్ను సిట్ కార్యాలయంలోనే ఉంచారు. సిఐడీ కార్యాలయంలో ఆయన్ను ఇంటరాగేట్ చేశారు. దాదాపు 20 ప్రశ్నలు సంధించగా వేటికీ చంద్రబాబు సమాధానాలు ఇవ్వలేదు. తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, కోర్టులోనే మాట్లాడతానని చంద్రబాబు పదేపదే చెప్పారు.ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఆయన్ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టులో తన వాదనలు తానే వాదించుకున్నారు చంద్రబాబు. తనపై మోపిన అభియోగాలన్నీ అబద్ధాలు, కట్టు కథలేనని, ఈ కేసుకు తనకు ఎలాంటిసంబంధం లేదని చంద్రబాబు వాదించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. స్కిల్ డెవలప్మెంట్ కు 2015-16 బడ్జెట్ లో పొందుపర్చాం. దీనిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ఎలా ప్రశ్నిస్తారని ఎదురు ప్రశ్నించారు.2021 డిసెంబర్ నాటి ఎఫ్ ఐఆర్ లో తన పేరు లేదని, కానీ ఇప్పుడు చేర్చారనీ చంద్రబాబు ఆరోపించారు.గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయడం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు.
రెండున్నర కోట్లు ఖర్చు చేసినా.. నో యూజ్
ఈకేసులో విచారణ కోసం ఢిల్లీనుంచి ప్రముఖ అడ్వకేట్ సిద్ధార్ధ్ లూథ్రాను తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది.కీలక కేసులు వాదించుందకు రోజుకు కోటిన్నర రూపాయలు వసూలు చేస్తున్న లూథ్రాకు ఫ్లైట్ ఖర్చులు, వసతి సదుపాయాలు అదనంగా చెల్లిస్తారు.
రేపు హైకోర్టుకు బాబు అపీల్
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టయి రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వయసు, హోదా, భద్రత రీత్యా ప్రత్యేక గృహ నిర్భంధంలోగానీ, లేదా వసతి సదుపాయాలున్న ప్రత్యేక జైలులో గానీ ఉంచాలని, ఇంటి భోజనం , మందులు అందేలా చూడానలి చంద్రబాబు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కేసుకు సంబంధించిన అన్ని కీలక ఆధారాలను సిట్ కోర్టులో ప్రవేశపెట్టింది.రేపు ఉదయం ఇదే కేసుపై హై కోర్టులో బెయిల్ కు అపీల్ చేయనున్నారు.
తాను నిప్పు అనే చంద్రబాబు ACB
తన రాజకీయ జీవితం మచ్చలేనిదని తాను కడిగిన ముత్యాన్ని అని, నిప్పుననీ పదేపదే చెప్పే చంద్రబాబు తాజా పరిణామాల నేపధ్యంలో బాగా డల్ అయిపోయారు. తీర్పు విన్న తర్వాత విషణ్ణ వదనంతో వెనుదిరిగారు. చంద్రబాబుపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినా వాటన్నింటిపైనా స్టేలు తెచ్చుకుని కొనసాగుతున్నారు. అందుకే ఆయనపై వ్యవస్థలను మేనేజ్ చేస్తారనే విమర్శలున్నాయి.
పోలీసుల ముందస్తు వ్యూహం
చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసు రీత్యా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు పాల్పడే ఆస్కారమున్నా ముందునుంచే ఎక్కడికక్కడ వారిని నియంత్రిస్తూ ముందుకు సాగారు.రాష్ట్రమంతా 144 సెక్షన్ విధించారు. రాత్రి మొత్తం ఏపీ సిఐడీ కార్యాలయం ముందు వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించడమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తే ఉద్రిక్త పరిస్థితుల రీత్యా ఎక్కడికక్కడ పక్కా ప్లానింగ్ తో వ్యవహరించి ఎలాంటి గొడవలు రేగకుండా జాగ్రత్త పడ్డారు.జనసేనాని పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలో వచ్చి హడావుడి చేయాలని చూసినా పోలీసులు వారిని డీల్ చేయడంలో చాలా ఓపిక వహించారు. మొత్తం మీద పోలీసులు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండానే ఈ వ్యవహారాన్ని లాజికల్ గా ఒక ముగింపుకు తేగలిగారు.