ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం(Rain) కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అందుకని సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ ఇవాళ మరోసారి తలపడుతున్నాయి. ఆదివారం అంటే నిన్న పూర్తి కావాల్సిన మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. ముందస్తు హెచ్చరికలతో మ్యాచ్కు రిజర్వ్ డేను కేటాయించారు. కానీ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సజావుగా సాగుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
వర్షం పడితే చెరో పాయింట్… (Rain)
అయితే నేడు కూడా మ్యాచ్ జరగకపోవచ్చు.కొలంబోను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎప్పడు పడతాయో తెలీక మ్యాచ్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. వర్షమే పడితే మరోసారి మ్యాచ్ రద్దు అయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అదే జరిగితే రిజర్వ్ డే రోజు కూడా రద్దైన మ్యాచ్గా ఇది నిలిచిపోనుంది. ఒకవేళ వర్షం కాస్త శాంతిస్తే ఓవర్లు కుదించి మ్యాచ్ను కొనసాగిస్తారు. పూర్తి ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం కనిపించడం లేదు.కానీ అభిమానులు మాత్రం వర్షం అడ్డుపడకూడదని, పూర్తి ఓవర్ల ఆట జరగాలి అని కోరుకుంటున్నారు.ఊహించినట్లే జరిగింది
దాయాదుల పోరును తిలకించేందుకు ఎదురుచూసిన అభిమానుల ఆసక్తిపై వర్షం(Rain) నీళ్లు జల్లింది. నిన్న భారత్ ఇన్నింగ్స్సగం ముగిసే సరికి భారీ వర్షం కురిసింది. మూడున్నర గంటలపాటు వేచిచూసినా ఫలితం లేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు వరుసగా రెండో మ్యాచ్లోనూ మంచి ఇన్నింగ్స్ దక్కింది. ఓపెనర్లు గిల్, రోహిత్ చక్కటి సమన్వయంతో పాక్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆరంభంలో రోహిత్ కాస్త ఆచితూచి ఆడినా.. గిల్ మాత్రం దూకుడుగానే ఫోర్లతోనే సమాధానం ఇచ్చాడు.
రిజర్వ్ డే ఉందని ఫ్యాన్స్ ఆనందపడినా ఆ ఆశ కూడా ఆవిరవుతోంది. కారణం నేడూ కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు 80 శాతానికి పైగానే ఉన్నాయి. నిన్నటిమాదిరిగానే కొలంబోలో నేడూ ఉదయం పూట ఎండకాచింది. ఆకాశంలో ఎక్కడా మబ్బులు లేవు.. అయితే నిన్న వాతావరణం ఇంతకంటే బాగానే ఉన్నా తీరా మ్యాచ్ ఆరంభమై 24 ఓవర్లు అయ్యాకవరుణుడు ఎడతెరిపి లేకుండా కురవడంతో ఆట మధ్యలోనే ఆగిపోయింది. నేడూ అవే సీన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. స్థానిక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకూ కొలంబోలో వర్షాలు పడే అవకాశం.
49 శాతం ఉండగా సాయంత్రం 4 నుంచి 6 వరకూ 73 శాతం ఉంది. ఇక రాత్రి 8తర్వాత అయితే వర్షం కురిసే అవకాశాలు వంద శాతం ఉందన్ని వాతవరణ శాఖ చెప్పేసింది. అంటే ఈ లెక్కన చూస్తే ఇవాళ కూడా మ్యాచ్ జరిగే అవకాశాలు దాదాపు లేనట్టే అన్ని తెలుస్తోంది.
ఫలితం తేలాలంటే ఏం చేయాలి?
ఆట సాగడానికి వరుణుడు ఏదైనా అవకాశమిచ్చి మనం ఇన్నింగ్స్ అయినా పూర్తి చేసి,
పాకిస్తాన్ను 20 ఓవర్లైనా ఆడనిస్తేనే ఫలితం తేలే ఛాన్స్ ఉంది. వేవీ లేక మ్యాచ్ వర్షంతో అగిపోతే అధికారికంగా రద్దు చేయాల్సిందే. అప్పుడు ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ ఇస్తారు. ఇలా అయితే ఫైనల్ చేరే క్రమంలో భారత్తో పాటు పాకిస్తాన్కూ తిప్పలు తప్పవు. ఇది ఇలా ఉండగా పాక్ బౌలర్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ను వరుణుడు ఆదుకున్నాడని అన్నాడు. టాస్ గెలిచిన వెంటనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్కు దిగడంఆశ్చర్యపరిచిందని చెప్పాడు. సో..ఇరు జట్ల భవిష్యత్తును డిసైడ్ చేసేది వరుణుడే అనమాట.