మనం ఎంత కాలం తో పాటు ఎంత ముందుకు వెళ్లిన ఎంత అభివృద్ధి సాధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యంగానూ ,గమ్మత్తుగా ను ఉంటాయి.ఎంత అభివృద్ధి సాధించిన ఇంకా దేవుడిని నమ్మేవారి సంఖ్యా తగ్గలేదు,దేవుడికి పూజలు చేస్తున్నారు, కొన్ని ముఖ్య రోజుల్లో నో లేదంటే వారి ఇస్తా దైవాల కు సంభందించిన రోజుల్లో ను ఒక్క పుట లేదంటే రాత్రి వరకు ఉపవాసం చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ముద్దు పూటలా తింటూ ఆనందం గ జీవిస్తున్నారు. దేవుడి యందు భక్తి తో వారికి ఒక రోజు అయితే కచ్చితం గ తలస్నానం చేస్తున్నారు. కొంతమంది తలస్నానం చేయడం వలన ఫ్రెష్ గా ఉంటుంది అని చెప్పి రోజు మర్చి రోజు కూడా తలస్నానం చేస్తున్నారు.అయితే మనం ఇవన్నీ చేయడానికి పురాణాల్లో ఓ పెద్ద కథే ఉంది అదేంటో తెలుసుకుందామా..
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు పెద్దలు.మరి మానవాళి జీవన విధానానికి సంబంధించిన దాన్లో ఈశ్వరుడు లేకుండా ఉంటాడా చెప్పండి..? ఇంతకీ ఆ కధ ఎంటో ఆ కధ కి ఈశ్వరుడు కి ఉన్న సంబంధమేంటో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు పాత రోజుల్లోకి అంటే కొన్ని వేళా సంవత్సరాల వెనక్కి వెళాల్సిందే..పూర్వం అంటే మానుషలంత స్వార్ధం,మోసం,ధన దాహానికి దూరం గా ఉన్న రోజుల్లో కార్తీక మాసం వచ్చిందంటే అందరూ కలిసి పండుగ లా జరుపుకుంటూ కలిసి మెలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునేవారు.వారి భక్తి కి ఈశ్వరుడు ఏంత్తో సంతోషించి నందీశ్వరుడిని(Nandeeswara) పిలిచి ఓ మాట చెప్పాడు ఆ సందేశాన్ని భూలోకం ;లో ఉన్న ప్రజలందరికీ చెప్పమని చెప్పాడు.
ఈశ్వరుడు నందీశ్వరునికి చెప్పిన సందేశం ఏంటంటే..
1. రోజుకి మూడు పూటల స్నానం చేయాలనీ…ప్రజలంతా ప్రతిరోజు తల స్నానం చేయాలని.
2. వారానికి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని…మిగిలిన రోజుల్లో ఉపవాసం ఉండాలిని ప్రజలకి చెప్పిరమ్మని నందీశ్వరునికి చెప్పి పంపించాడు.
శివడు ఎప్పుడెప్పుడు తనకు పని చెప్తాడా చేద్దమా అని ఎదురుచూస్తుంటారు నంది. శివ ఆజ్ఞ కై ఎదురుచూసే నంది కి ఈశ్వరుడు పని చెప్పడం తో ఎంతో ఆనందం తో ఆలస్యం చెయ్యకుండా భూలోకానికి బయల్దేరాడు..భూలకానికి వచ్చాక ఈశ్వరుడు యందు భక్తులు కు ఉన్న భక్తి ని చూసి వారి సందడి చూసి తనని తాను మర్చిపోయాడట అంతే కాదు ఈశ్వరుడు చెపిన పని, తాను ఎందుకు వచ్చాడో అన్నది కూడా మర్చిపోయాడట. ఆ తరువాత తాను వచ్చిన విషయం గుర్తొచ్చి ఈశ్వర సందేశాన్ని ప్రజలకు చెప్పాడట..ఆ చెప్పడం లో నే ఒక పెద్ద పరపాటు చేసాడు..
నందీశ్వరుడు చేసిన పొరపాటు..
శివ నామస్మరణ తో మైమరచిపోయిన నందీశ్వరుడు(Nandeeswara) సందేశాన్ని మార్చి చెప్పేసాడు ఏమనంటే..
1. ప్రజలంతా మూడు పూటలా భోజనం చేయాలి.. వారానికి ఒక్క రోజు ఉప్పవాసం ఉండాలి .
2. ప్రతి రోజు స్నానం చేయాలి.. వారానికి ఒక్కసరి తలస్నానం చేయాలి.
ఇది విన్న ప్రజలు ఆనందం తో అలాగే చేస్తాం అని చెప్పారు. నంది(Nandeeswara) కూడా తాను వచ్చిన పని నిర్విఘ్నం గా పూర్తి చేశాను అని సంతోషం తో కైలాసానికి వెళ్ళాడట. ఈశ్వరుడు నంది ని చూసి వెళ్లిన పని ఎలా జరిగిందగి అని అడిగాడట. విజయవంతగా నిర్విఘ్నం గ పని పూర్తి చేశాను అని చెప్పాడట నంది. కానీ ఈశ్వరుని ఎక్కడో అనుమానం వచ్చి ఎం చెప్పావ్ నంది అని అడిగాడట.. “ప్రజలంతా ప్రతిరోజూ మూడు పూటలా భోజనం చేయాలి.. వారానికి ఒక పూట ఉపవాసం ఉండాలి”, ప్రతిరోజూ స్నానం చేయాలి.. వారానికొకసారి తలస్నానం చేయాలి’ అని ,మీరు ఇచ్చిన సందేశం చెప్పను స్వామి అని బదులిచ్చాడు.ముక్కంటికి కోపం వచ్చి ఎంత పని చేసావు నందీశ్వర.. ప్రతి రోజు మూడు పూటలా తినాలి అంటే అంత ఆహారమెక్కడ నుంచి వస్తుంది అంత ఆహారాన్ని కోసం ఎంత కష్టపడాలి..? అని ప్రశ్నించాడట శివుడు..
నందీశ్వరుడు(Nandeeswara) తటపటాయిస్తూ ఎం చెప్పాలో తెలియక మౌనం గా ఉండిపోయాడట. నేను ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు చేరవెయ్యలేకపోయావు అంతేకాకుండా వారికి మరింత భారం కలిగేలా సందేశాన్ని చెప్పి వచ్చావు. ఈ తప్పు నీ వల్లే జరిగింది కాబ్బట్టి శిక్ష కూడా నీకె వేస్తా అన్నాడట ఈశ్వరుడు.శిక్షగా ఈశ్వరుడు నంది(Nandeeswara) చేసిన తప్పుకు నందీశ్వరుడే మానవాళి ఆహారానికి కష్టపడాలి అని ఆఙ్ఞాపించాడట.ఆనాటి నుంచి ఈరోజు వరకు నందీశ్వరుడు ఎద్దు లా మారి పొల్లం దున్నడం మొదలైన అన్ని ఆహారానికి సంభందించిన పనులు చేస్తున్నాడు.పాపం..నందీశ్వరునికి(Nandeeswara) ఎంతటి పెద్ద శిక్షో కదా..! మాత్రం ప్రతి మూడు పూటలా తింటూ మరికొందరైతే స్నాక్స్ అని పేరుతో నాలుగో పూత తింటూ..వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తూ.. వారానికి ఒక్క పూత ఉపవాసం ఉంటూ..సంతోషంగా ఉన్నాము.