ఈశ్వరుడు అంటే నే అభిషేక ప్రియుడు.. చెంబుడు నీళ్లు పోసి శివ.. అంటే చాలు కష్టాలన్నీ దూరం చేసేస్తాడు అంటారు పెద్దలు.శివ లింగం అగ్నితత్వం తో ఉంటుంది కాబ్బటి ఆ శివుడి ని చల్లబరచడానికి తద్వారా అయన చల్లని ఆశీస్సులు పొందవచ్చని పురోహితులు చెబుతుంటారు. అలంటి శివుడు కి రుద్రాభిషేకం అంటే ఎంతో ఇష్టం. ఈశ్వరునికి అభిషేకమే కాకుండా ఇలా రుద్రాభిషేకం(Rudrabhishekam) చేస్తే కోరి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.శివుని కి ఎన్నో రకాల పూజలు చేసిన రుద్రాభిషేకం ఎంతో పవిత్రమైనది అని మరియు ఎంతో సత్ఫలితాన్ని ఇచ్చేది గా చెప్పబడింది.
సాధారణం గా ఈ రుద్రాభిషేకం సోమవారం చేయడం మంచిదట పైగా ఇప్పుడు శ్రావణ మాసం , ఈ మాసం శివుని ఎంతో ఇష్టమైన మాసం కాబ్బటి ఈ మాసం లో శివుని రుద్రాభిషేకం చేసిన చేయించిన ఎంతో గొప్ప ఫలితాలని అందుకోవచ్చు అని చెబికుతున్నారు పండితులు.
అయితే రుద్రాభిషేకం(Rudrabhishekam) ఎంతో శక్తీవంతమైనది కావున రుద్రాభిషేకం చేసేటప్పుడు తగిన నియమాలు పాటిస్తూ చేస్తే ఫలితం దక్కుతుందట.
సాధారణం గా అభిషేకం అనగానే ముందు గ నీటి తో చేస్తారు కానీ రుద్రాభిషేకం చెరువు నీటి తో కానీ బావి నీరు తో కానీ చెయ్యరాదట ఒకవేళ ఆలా చేసిన ఫలితం శున్యం అంటున్నారు పండితులు. మరి ఎలా చేయాలి అంటే..కలశం లో ఉంచిన నీటితో మాత్రమే రుద్రాభిషేకం చేయాలట.అలాగేయ్ రుద్రాభిషేకం సమయం లో శివ లింగం పై మారేడు దళం ఉంచి చేయాలట.
ఇంతటి గొప్ప ఫలితాన్ని ఇచ్చే రుద్రాభిషేకానికి కావాలని ద్రవ్యాలు ఏంటో వాటి ఫలితాలు ఎంతో తెలుసుకుందాం..
ఈ రుద్రాభిషేకం కి కావాల్సిన ద్రవ్యలు..
నీరు:
తల మీద గంగ ను పెట్టుకున్న శివుని నీరు అంటే ఎంతో ఇష్టం.ఈ స్రావం మాసం లో ఈశ్వరునికి నీటి తో రుద్రాభిషేకం(Rudrabhishekam) చేస్తే ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారని పండితులు చెబుతున్నారు.వర్షాలు కురవక కరువు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వర్షాల కోసం పూర్వం శివుని నీటి తో రుద్రాభిషేకం చేసేవారట.అయితే ఈ నీరు కలశం లో ఉంచిన నీరు అయిఉండాలి,మరియు చల్లని నీటి ని సమర్పించాలట.
నెయ్యి:
మన హిందూ సంప్రదాయం లో నెయ్యి ఎంతో శ్రేష్టమైనది గాను పవిత్రమైనది గాను భావిస్తాము. నెయ్యి లేకుండా ఏ దేవునికి నైవేద్యం సమర్పించలేము అలాగే యజ్ఞయాగలోను నెయ్యి ని ఉపయోగిస్తారంటే నెయ్యి కి ఉన్న ప్రాధాన్యత ఏంటో మనకు అర్ధం అవుతుంది. అటువంటి నెయ్యి తో రుద్రాభిషేకం(Rudrabhishekam) చేస్తే కుటుంబం లోని సమస్యలు దూరమవుతాయట. దానితో పాటు కుటుంబం లో అందరికి ఆనందం,మానసిక ప్రశాంతత లభిస్తాయట అంతేకాకూండా ఆ శివయ్య చల్లని కుటుంబ అభివృద్ధి కి కూడా నెయ్యి తో రుద్రాభిషేకం చేస్తే చాలని చెబుతున్నారు.
పుణ్య జలం :
జాలం అంటే నీరు అది మనందరికి తెలుసు. మరి పుణ్యం జాలం అంటే ఏంటో అనుకుంటారా.. ఇదే కూడా మనందరికీ తెలిసిందేనండి.పుణ్యక్షేత్రాల లో నీరే పుణ్యం జలం అంటారు.ఈ శ్రావణ మాసం లో ఏదైనా పుణ్య క్షేత్రాన్ని దర్శించి ఆ పుణ్యక్షేత్రం లో నీరు తెచ్చి శివుని రుద్రాభిషేకం(Rudrabhishekam) చేస్తే వారికి ఈశ్వరుడు పునర్జన్మ భాధ లేకుండా అంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడట.
తేనె:ఈశ్వరునికి తేనె తో రుద్రాభిషేకం చేస్తే వారికి సమాజం లో గౌరవం పొందుతారట. అంతేకాకుండా ఉద్యోగ లో అభివృద్ధి, పదోన్నతులు కూడా లభిస్తాయట. కాబ్బటి ఉద్యోగం లో పురోగతి కావాలనుకునేవారు శివునికి తేనె తో రుద్రాభిషేకం చేస్తే వారు ఆశించిన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
పెరుగు:
సంతానం కోసం ఎదురుచూసే వారు శివునికి పెరుగు తో రుద్రాభిషేకం(Rudrabhishekam) చేస్తే తప్పకుండ వారికి సంతానం కలుగుతుందట.
పంచామృతం:పంచామృతం అనే పేరు మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. పంచామృత అంటే 5 ద్రవ్యాలు అని అర్ధం అవి పచ్చి ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు నెయ్యి,పంచదార మరియు స్వచ్ఛమైన తేనె అన్నిటిని కలిపి పంచామృతం అంటారు. పైన ఈ ద్రవ్యాలు అన్నిటితో విడివిడి గ రుద్రాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచు తెలుస్కునము ఇప్పుడు ఈ ద్రవ్యాలన్నీ కలిపి పంచామృతం తో రుద్రాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం.పంచామృతం తో రుద్రాభిషేకం (Rudrabhishekam)చేసిన వారి కోరిన కోరికలన్నిటిని ఆ మహా శివుడు నెరవేరుస్తాడట.
చెరుకు రసం:
ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనది చెరుకు రసం.ప్రతి సోమవారం ప్రదోష వేళ లో చెరుకు రసం తో శివాభిషేకం చేస్తే తీరిన కోరిక అంటూ ఉండదు అంటారు.అలంటి గొప్ప అభిషేక ద్రవ్యం చెరుకు రసం. ఆర్ధికం గా ఇబ్బంది పడేవారు కానీ అప్పుల ఊబి లో కురుకుపోయున్న వారైనా చెరుకు రసం తో రుద్రాభిషేకం చేస్తే వారికి డబ్బు సమస్య తీరిపోతుందట.
రుద్రాభిషేకం గురించి సందేహాలు..
కొంతమంది రుద్రాభిషేకం సాయంత్రం చేయవచ్చా అనే సందేహం తో ఉంటారు రుద్రాభిషేకం(Rudrabhishekam) సాయంత్రం కూడా చేసుకోవచ్చట.ఈ రుద్రాభిషేకానికి కచ్చితం గ గంట నుంచి ఒకటిన్నర గంట సమయం పడుతుందట. ఓపిక గ చేసుకుంటే అంతటి అదృష్టవంతులు మరొకరు ఉండరు అంటున్నారు శివ భక్తులు.