సినీ ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అయినా.. త్రిష(Trisha) బోర్ కొట్టని బ్యూటీ.ఇప్పటికీ ఆమెకు లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు సినిమాలకు దూరమైందికానీ తమిళంలో త్రిష తన హవా కంటిన్యూ చేస్తోంది.40ఏళ్లు వచ్చినా త్రిష అందమే అందం.. ఇంకా అసంఖ్యాకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం.త్రిష పని ఔట్ అని అందరూ అనుకుంటున్న టైమ్ లో పొన్నియన్ సెల్వన్ తో బ్యూటీ ఈజ్ బ్యాక్ అనిపించింది. మణిరత్నం త్రిష ను అంత అందంగా తెరకెక్కించాడు.పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రమోషన్స్ లో ఈ అందాల భామే సెంటరాఫ్ అట్రాక్షన్.
అగ్ర హీరోలందరి సరసనా
తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది త్రిష. వర్షంతో మొదలై అతడు, బాడీగార్డ్ ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. 2016 వచ్చిన నాయకి సినిమాయే త్రిష తెలుగులో ఆఖరు సినిమా.. ఆసినిమా మాత్రం హిట్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఆ సినిమా తరువాత తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తన రాక కోసం ఆతృతగా ఎదురుచుస్తున్నారు. ఇప్పుడు ఏడేళ్ల తరువాత తెలుగు లోకి రీ ఎంట్రీ ఇస్తోంది ఈ అందాల భామ.
చిరు సరసన త్రిష (Trisha)
మెగా స్టార్ చిరంజీవి 156వ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనుంది త్రిష. గతంలో వీరిరువురూ స్టాలిన్ సినిమాలో నటించి మెప్పించారు. 17 సంవత్సరాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూవీ చూడబోతున్నాం. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుంది. సినిమా టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. తండ్రి కొడుకుల కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి తండ్రి పాత్రలో నటింస్తుండగా, త్రిష అతని భార్య గా నటిస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా పనిచేస్తుంది. యువి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ మూవీ రూపొందుతోంది.
10 ఏళ్ల తరువాత ట్వీట్ కి రీ ట్వీట్ (Trisha)
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే త్రిష తాజాగా ఓ దర్శకుడి ట్వీట్ను రీ ట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన పెట్టిన 10 ఏళ్లకు త్రిష రిప్లై ఇవ్వడం విశేషం. ఎప్పుడు యాక్టివ్ గా ఉండే త్రిష ఇన్నేళ్ల తరువాత రీ ట్వీట్ చేయడం ఏంటా అని అందరు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..
2007లో రిలీజ్ అయిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది.
వీరిద్దరి కాంబినేషన్ లో ఈ కుటుంబ కథా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాపై 2013 లో సెల్వరాఘవన్ ఓ ట్వీట్ చేశారు. ‘చాలా రోజుల తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’ సినిమా చూశాను. వెంకటేష్, త్రిషలతో కలిసి పనిచేయడం నాకు ఓ గొప్ప అను భూతినిచ్చింది. దీని సీక్వెల్ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ వాళ్లిద్దరినీ ట్యాగ్ చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్.
ఆ ట్వీట్కు త్రిష ఇప్పుడు రిప్లై ఇచ్చారు.‘నేను కూడా సీక్వెల్ల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని స్పందించింది త్రిష.. దీనిపై నెటిజన్లు కాస్త ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘చాలా త్వరగా రిప్లై ఇచ్చారే అని ఒకరు అనగా ‘ఇంత మంచి సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాం ‘ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా దర్శకుడి ట్వీట్ కు త్రిష దశాబ్దం తర్వాత రిప్లై ఇవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.