(water)
క్షణికావేశంలో ప్రేమలు.. ఆ వెంటనే విడిపోడాలు..కాదంటే.. లేదంటే హత్యలు.. ఇవాల్టి తరం జనరేషన్ ఇలాగే తయారైంది. ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. అదేంటని నిలదీస్తే.. ఖేల్ ఖతమ్.. లేదా భార్య వత్తిడితో ప్రియురాలి హత్య.. ఇవాల్టి యువతరం ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్న తప్పులు అన్నీ ఇన్నీ కావు. ప్రేమించడం వరకూ ఓకే.. కానీ ఎదుటి వ్యక్తి ఆలోచనలలో తేడా వస్తే ప్రాణాలు తీయడం అలవాటుగా మారుతోంది. ఒకరిని ప్రేమించి మరోకరిని పెళ్లాడిన వాళ్లు చాలామందే ఉంటారు. పెళ్లికి ముందు ప్రేమలు కామన్.. కొందరి కలలు సాకారమవుతాయి. మరికొందరివి కావు.. అయితే ఇలా విడిపోయినప్పుడు రెండు పక్షాలు సంయమనంతో ఉంటే గొడవలే ఉండవు.. అలా కాకుండా పెళ్లి తర్వాత కూడా ప్రేమను కొనసాగిస్తేనే తంటాలు వస్తాయి.ఈ ట్రయాంగిల్ లవ్ లో ఒక్కోసారి ఎవరో ఒకరి ప్రాణం పోవచ్చు.. అలాంటిదే ఈ స్టోరీ.. వివరాల్లోకి వెళితే..
బక్కెట్ నీళ్లలో(water) ముంచి చంపేశాడు
గుజరాత్ లోని నైగాన్ లో ఓ 28ఏళ్ల యువతిని బక్కెట్ నీళ్లలో(water) ముంచి చంపేశాడు ప్రియుడు.. ఆపై నీట్ గా సూట్ కేసులో ప్యాక్ చేసి డిస్పోజ్ చేశాడు. ఈ దారుణ హత్యకు అతని భార్య కూడా సహకరించడం విచిత్రం. 34 ఏళ్ల గ్రాఫిక్ డిజైన్ మనోహర్ శుక్లా అదే ఫ్లాట్ లో అద్దెకుంటున్న 28 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడాదిన్నర పాటు సాగిన వీరి బంధం మనోహర్ కు పెళ్లి కావడంతో ఇబ్బందుల్లో పడింది. పెళ్లి అయిన తర్వాత కూడా తన దగ్గరకు రావడం లేదని ప్రియురాలు అలగడంతో మనోహర్ ఆమెతోనూ వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. భార్యతో బిడ్డను కన్నాక కూడా మనోహర్ ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే విషయం తెలిసిన భార్య మనోహర్ ను నిలదీసింది. పెళ్లయి ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా ఇంకా ఇలాంటి వ్యవహారాలేంటని అడ్డు పడింది. దాంతో చేసేదేంలేక మనోహర్ ప్రియురాలిని సైలెంట్ గా లేపేయాలని స్కెచ్ వేశాడు. ఈ దారుణానికి అతని భార్య కూడా ఓకే అంది.. పథకం ప్రకారం మనోహర్ ప్రియురాలిని బక్కెట్ నీళ్లలో ముంచేశాడు.. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత భార్య, భర్త కలసి డెడ్ బాడీని సూట్ కేసులో నీట్ గా ప్యాక్ చేసేశారు. ఆపై స్కూటర్ పై 150 కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్ వల్సద్ లోని ఒక చెరువు పక్కన పడేశారు.
సోదరి కంప్లయింట్ తో కదిలిన తుట్ట
మృతురాలు నైనా మహత్ సోదరి తన చెల్లెలు కనిపించడంలేదంటూ పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. మనోహర్ ను అనుమానించిన పోలీసులు అరెస్టు చేసి తమదైన శైలిలో విచారణ జరిపారు. ఇంటరాగేషన్ లో మనోహర్ తానే నైనా మహత్ ను చంపేసినట్లు అంగీకరించాడు.
మనోహర్ కు మరొకరితో పెళ్లి జరగబోతోందని తెలిసి నైనా మహత్ అతనిని నిలదీసింది. 2019లో నైనా మహత్ మనోహర్ పై రేప్ కేసు, దుర్భాషలాడినట్లు కేసులను పెట్టింది. అయితే వాటిని వెనక్కు తీసుకోమని కోరితే అందుకు నైనా నిరాకరించింది.ఆ కసితోనే మనోహర్ ఆమెను అంతం చేయాలనుకున్నాడు. అందుకు భార్య కూడా సహకరించడంతో ప్రియురాలిని బక్కెట్ నీళ్లలో ముంచి చంపేశాడు. దారుణమైన ఈ ఘటన వివరాలు తెలిసి మనోహర్ చుట్టు పక్కల వారు దిగ్భ్రాంతి చెందారు.
2013నుంచే వీరిమధ్య ప్రేమ..
2013నుంచే మనోహర్, నైనా మహత్ వసాయిలో ఇరుగుపొరుగు ఇళ్లలో నివసించేవారని ఏడాది తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. 2018లో మనోహర్ కు పూర్ణిమ తో పెళ్లయ్యింది. అయినా మనోహర్ ప్రియురాలితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. 2019లో పూర్ణిమ వీరి వ్యవహారం తెలిసి మనోహర్ ను నిలదీసింది.
ఆ తర్వాత నెల్లాళ్లకు నైనా మహత్ కనిపించకుండా పోయింది. నైనా సోదరి తన చెల్లెలు కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్ లో సీసీ టీవీ సదుపాయం లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం ఆలస్యమైంది. నైనాను హత్య చేసినట్లు మనోహర్ అంగీకరించాక ఆ డెడ్ బాడీ మరో ప్రదేశంలో దొరికింది. మృతదేహం కుళ్లిపోవడంతో చేతిపై టాటూ ఆధారంగా గుర్తించారు. డెడ్ బాడీకి డీఎన్ ఏ టెస్టులు చేసి అది నైనాదేనని నిర్ధారించుకున్నారు.