ఉదయాన్నే లేవగానే ఓ కప్పు మాంఛి బ్రాండెడ్ కాఫీ(coffee) పడితేగానీ మన దిన చర్య సెట్ అవదు.. చాలామందిని వేడి వేడి కాఫీ ఘుమఘుమలే నిద్ర లేపుతాయి. కాఫీ వాసన ముక్కుకు తగిలితేనే వాళ్ల నిద్ర కళ్లు వీడేది.. కాఫీతో మనకున్న అవినాభావ సంబంధం అలాంటిది మరి.. ఇక దేశీయ కాఫీ టేస్టే వేరు.. అందులోనూ అరకు కాఫీ అంటే అదిరి పోవాల్సిందే.. ఒక్క కప్పు చాలు.. మన మైండ్ రిఫ్రెష్ అవడానికి.. మన డైలీ రొటీన్ హాయిగా సాగడానికి.ఇలా మన డైలీ వర్క్ షెడ్యూల్ కి మెగా బూస్టింగ్ ఇచ్చే కాఫీ సీక్రెట్ ను ఇప్పుడు ప్రపంచ అతిధులకూ మనం పంచేశాం..
జీ-20 అతిధులకు స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్
అరకు కాఫీకి(coffee) జీ-20 సదస్సు పుణ్యమాని ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. జీ-20 సదస్సుకు విచ్చేసిన డెలిగేట్లు అందరికీ ఈకాఫీ ప్యాక్ లను మన ప్రభుత్వాధినేతలు కానుకగా ఇచ్చి పంపారు. అత్యంత నాణ్యమైన సరుకును ప్రపంచ దేశాలకు సరిపడే మోతాదులో తయారు చేయగలిగిన శక్తి సామర్ధ్యాలు భారత్ కు ఉన్నాయని చెప్పడానికి అరకు కాఫీయే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. అరకు కాఫీ రుచులు అతిధులకు గిఫ్ట్ గా ఇవ్వడంపై తానెంతో గర్వపడుతున్నానన్నారు ఆయన. అరకు ఒరిజినల్స్ బోర్డుకు ఛైర్మన్ కూడా అయిన ఆనంద్ మహీంద్ర అరకు సరుకుకు సాటి, పోటీ మరేది లేదని తేల్చేశారు. ప్రపంచంలోకే ది బెస్ట్ కాఫీ పంట భారత్ లో పండుతోంది అంటూ ఆయన ఎక్స్ (ట్విటర్) లో ట్వీట్ చేశారు.అత్యంత ఆఘ్రాణ భరితమైన వంద శాతం ఆర్గానిక్ కాఫీ ప్లాంటేషన్స్ అరకులో ఉన్నాయనడానికి ఇదే సంకేతం అని ఆనంద్ కామెంట్ చేశారు.
As the Chairman of the Board of Araku Originals, I can’t argue with this choice of gift! It just makes me very, very proud. Araku Coffee is the perfect example of ‘The best in the World, Grown in India’… https://t.co/VxIaQT6nZL
— anand mahindra (@anandmahindra) September 12, 2023
ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆఘ్రాణ భరితమైన కాఫీ పంటని పండించే ఆర్గానిక్ ప్లాంటేషన్స్అరకు వ్యాలీలో ఉన్నాయి. ఈ కాఫీ గింజల్లో అరకు లోయలోని సారవంతమైన భూమి, అక్కడి ఉష్ణోగ్రత, వాతావరణం కలగలిపిన సారం అంతా నిండి ఉందని ఏఎన్ ఐ వార్తా సంస్థ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. అలాగే అరబిక్ కాఫీ గింజలకు కూడా అత్యంత అరుదైన సువాసన, గమ్మత్తు ఉంటుందని కామెంట్ చేసింది.
గిరిజనుల స్వచ్ఛమైన నవ్వుకు ప్రతిబింబం (coffee)
అరకు కాఫీ పంటను దక్షిణాదిన ఏపీలో గిరిజనులు పండిస్తారు. తూర్పు కనుమల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో ఉపాధి లేని గిరిజనులకు స్వయంఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన కృషి ఫలితమే అరకు కాఫీ బోర్డు ఏర్పాటు.2008లో అరకు కాఫీని ప్రపంచ దేశాలకు పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. నాంది ఫౌండేషన్ ద్వారా ఈ ఆర్గానిక్ కాఫీ పొడుల డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. ప్రస్తుతం అరకు కాఫీ ఉత్పత్తులు 9 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే పారిస్, బెంగళూరులలో అరకు కాఫీ స్టోర్స్ ఉన్నాయి. మొత్తానికి మన అరకు కాఫీ ప్రపంచాన్ని ఫిదా చేసింది. అరకులో పండే కాఫీ ఉత్పత్తులకు గ్రేడ్ వన్ క్వాలిటీ సరుకుగా గుర్తింపు ఉంది.
కాఫీ పొడితో పాటు మరిన్న కానుకలు
జీ-20 అతిథులకు అరకు కాఫీ పొడితో పాటు హస్త కళలతో కూడిన ఆకృతులు, మన దేశ సంస్కృతి, ఘన వారసత్వాన్ని ప్రతిబింబించే ఎర్ర చందనపు బొమ్మలు, టీ ఉత్పత్తులు, పుట్టతేనే, పష్మీనా శాలువా, జిగ్రానా అత్తరు, ఖాదీ టోపీ కొన్ని స్మారక స్టాంపులు, నాణేలు కూడా ఇచ్చారు.