Salaar
200 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న సలార్ సినిమాకు కష్టాలు తప్పెలాగ లేవు. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కావాల్సి ఉండగా రిలీజ్ డేట్ పై షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ . ఈ సినిమా పోస్ట్ పోన్ చేశారు చిత్ర బృందం. సినిమా రిలీజ్ డేట్ ఎందుకు ఫిక్స్ చేయడం లేదు అనే ప్రశ్న టాలీవుడ్ లో తాజా వార్తగా మారింది. ఈ మూవి పోస్ట్ పోన్ కి కారణం పోస్ట్ ప్రొడక్షన్ లో ముఖ్యంగా VFX డెలివరీలో కారణం అని మేకర్స్ చేబుతున్నారు. సలార్ సినిమాలో 300 షాట్ లలో ఎక్కువగా VFX షాట్ లను డెలివరీ చేయకపోవడమే ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
సలార్ సినిమాలో ఎక్కువ విఎఫ్ ఎక్స్ ఎడిటింగ్ సమస్య చివరి నిమిషంలో గందరగోళానికి దారితీసింది. 300 షాట్ లను మళ్లీ రీ షూట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుందని తేలడంతో సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు. సినిమాలో మేజర్ పార్ట్ VFX ఉండటం వల్లనే సలార్ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. చివరకు సినిమాను నవంబర్ లో దీపావళి కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ లలో ఒకేసారి రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్కఠంగా ఎదురు చూస్తున్నారు. గతంలో RRR సినిమా కూడా VFX కారణం వల్లనే లేట్ గా రిలీజ్ చేశారు.
సలార్ సినిమాలో ఎక్కువ మొత్తంలో గ్రాఫిక్స్ ను వాడుతున్నారా? Salaar
ప్రభాస్ మూవీ అందులోనూ భారీ బడ్జెట్ మూవీ అంటే గ్రాఫిక్స్ కూడా అంత రిచ్ గానూ ఎక్కువే ఉంటాయి..అందుకే సలార్ సినిమా VFX వర్క్ ను పది కంపెనీలకు డివైడ్ చేసి ఇచ్చారు. వాటిలో ఒక కంపెనీపై ఇప్పటికే అధిక భారం పడిందని వాటిని డెలివరీ చేయడానికి సెప్టెంబర్ 28 కి సాధ్యం కాదని చెబుతున్నారట. 300ల షాట్ లకు VFX చేయడం అంటే సినిమాను రీ క్రియేట్ చేయాల్సి ఉంది. సినిమా విడుదల అనుకున్నట్లుగా ఈనెల 28కి అయ్యేలా లేదు.దాంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.
సలార్ సినిమాకు ప్రభాస్ 100 కోట్లు, శృతిహాసన్ 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ 4 కోట్లు, జగపతి బాబు 4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
ప్రభాస్ కే ఎందుకిలా?
ప్రభాస్ కి ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు.. తీస్తున్న సినిమాలు రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతున్నాయి. మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ అనుకుంటే అందుకు పూర్తి రివర్స్ లో ప్రభాస్ కెరీర్ కొనసాగుతోంది. చేతిలో ఉన్న ప్రాజెక్టులు వాయిదాల మీద వాయిదాలు పడటంతో ప్రభాస్ ఇబ్బందులు పడుతున్నాడు. సరైన హిట్ లేక అల్లాడుతున్నాడు. ప్రభాస్ కి పాన్ వాల్డ్ ఇమేజ్ దక్కడం ఒక విధంగా కెరీర్ కు ఇబ్బందిగా మారుతోంది. బాహుబలి తర్వాత తీసిన సాహో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాతవచ్చిన రాథేశ్యామ్ మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా బాక్సాఫీస్ దగ్గర అది అంతంత మాత్రంగానే ఆడింది.