వ్రతాలు ,నోములు కేవలం స్త్రీల కు మాత్రమే కేటాయించబడినవి. మిగిలిన ఏ పూజలైన పురుషులు చేయవచ్చు. ఎంతో పవిత్రమైన శ్రావణమాసం లో వచ్చె అమావాస్య ని “పొలాల అమావాస్య(Polala Amavasya)”, “సర్వ అమావాస్య” అని అంటారు. శ్రావణ మాసం లో ప్రతి రోజు పవిత్రం అని చెప్తారు పెద్దలు. అంతటి గొప్ప మాసం లో వచ్చే అమావాస్య ఈ పొలాల అమావాస్య (Polala Amavasya). ఈ అమావాస్య కు ఎంతో ప్రత్యేకత ఉంది.సాధారణం గా అమావాస్య రోజు ను సూన్యం అంటారు కాబ్బటి ముఖ్యమైన పనులు ఏవి ఉన్న వాయిదా వేసుకుంటారు తప్ప అమావాస్య రోజు చేయరు,కానీ ఈ వ్రతం ఈ పొలాల అమావాస్య రోజె చేయాలట. అదే ఏ వ్రతమో తెలుసుకుందామా..!
స్త్రీలు చేసే వ్రతాలు అయిన తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల కోసం లేదా అష్టైశ్వర్యాలు కోసమో చేస్తారు అది కూడా పర్వ దినాలలో.అలాగే ఈ (Polala Amavasya) రోజు చేసే ఈ వ్రతం కూడా స్త్రీలు తమ పిల్లల సంరక్షణ కోసం చేస్తారట.ఈ వ్రతాన్ని పొలాల అమావాస్య వ్రతం (Polala Amavasya) అని అంటారట. ఈ వ్రతాన్ని కేవలం పిల్లల సంరక్షణ కోసం మాత్రమే కాదట,పెళ్లి అయినా చాల కలం అయినా సంతానం కలగని వారు ఈ వ్రతం ఆచరిస్తే తప్పకుండ వారు సంతానవంతులవుతారని ఈ వ్రతం గురించి పెద్దలు చెబుతున్నారు.
ఈ వ్రతం గురించి తెలిసిన వారు చేసేవారు కూడా ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారు అని చెప్పవచ్చు. సమయం లేదనో లేకపోతే మరో కారణం చేస్తానో పెద్దలు మనకు అందించిన ఇలాంటి అబ్దుతమైన వ్రతాన్ని పక్కన పెడుతున్నారు నేటి తరం స్త్రీలు. శ్రావణ మాసం లో ఏ పూజ చేసిన అందుకు రేటింపు ఫలితాన్ని అందుకోవచ్చు అని మనకందరికీ తెలుసు. అసలు ఈ వ్రతం గురించి తెలియని వారు,ఆ వ్రతం చేస్కునే ఆచారం లేని వారికి ఈ వ్రతాన్ని ఎలాచేసుకోవాలో ఇప్పుడు తెలుసుందాం
వ్రాత విధానం:
ఈ వ్రతాన్ని స్త్రీలు శ్రావణమాసం లో వచ్చే అమావాస్య రోజు చేసుకోవాలి.వ్రతం చేసుకునే రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజ చేసే స్థలం లో పసుపు తో అలికి అష్టదళ పద్మము ముగ్గు వేసి పసుపు కుంకుమల తో అలంకరించి ఆ పైన ఒక పీట ఉంచాలి పీట పై కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఒక ప్లేట్ లో బియ్యం పోసి ఉంచాలి. మనం ఏ పూజ చేసిన వ్రతం చేసిన ముందుగా గణపతి తో ప్రారంభిస్తాం కాబ్బటి పసుపు గణపతి ని తాయారు చేసుకొని అలాగే పసుపు గౌరమ్మ ను కూడా తాయారు చేసుకోవాలి. పసుపు గణపతి ని ఒక తమలపాకు పైన, పసుపు గౌరమ్మ ను మరో తమలపాకు పై ఉంచి ఈ రెండు తమపకులను ప్లేట్ పోసిన బియ్యం పై స్థాపన చేయాలట. ఆ తరువాత పీఠం వెనుక భాగాన గోడకు చిన్న పసుపు రాసి ఐదు కుంకుమ బొట్లు పెట్టాలట. ఇప్పుడు గౌరమ్మ వ్రతాన్ని తోరాలను సిద్ధం చేస్కోవాలట.
తోరాలు :
ఈ వ్రతానికి 4 తోరాలి సిద్ధం చేసుకోవాలి 2 పూల తోరాలు,2 పసుపు కొమ్ము తోరాలు.ఈ పసుపు కొమ్ములు విరగకుండా ఉండేలా చూసుకోవాలి.ఇలా తోరాలు కూడా సిద్ధం చేసుకున్నాక పాల తాళికలు,కలగాయ పులుసు నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలట, ఆ తర్వాత పూజ ప్రారంభివించాలట.పూజ సమయం లో అమ్మవారికి తొమిది గారెల దండ కానీ తొమిది బూరెల దండ కానీ సమర్పించాలట. తర్వాత ఆ బూరెల మాల కానీ గారెల మాల గాని నిండు సంతానవతి అయినా పెద్ద ముతైదువు కు తోరం తో పాటు చీర లేదా రవిక వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలట,ఇంకో తోరాన్ని సంతానం ఉన్న వారైతే వారి ఆఖరి సంతానం మొల లో కట్టాలట,సంతాన కోసం చేసేవారైతే ఆ పసుపుకొమ్ము తోరాన్ని మేడలో వేస్కోవాలట. ఇలా చెయ్యడం వలన ఆ తల్లి యొక్క సంతానం ఎటువంటి ఆర్యోగ్య సమస్యలకు గురవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
ఇక పిల్లలు కావాలనుకునేవారు ఇంకొక్క పని చేస్తే కచ్చితంగా వారికి అబ్దుతమైన సంతానం త్వరలో కలుగుతుందట,అదేంటి అంటే పూజ ఆఖరున అమ్మవారి ముందు ఆవు పాలతో అలికి అమ్మవారికి ఇలా చెప్పుకోవాలట”తల్లి నీ ఇల్లు ను నేను పాలతో అలికాను మా ఇల్లు ని బోసి నవ్వుల చిన్నారులతో కళాకలాడేలా చెయి తల్లి” అని వేడుకుంటే ఆ తల్లి తప్పక వరమిస్తుందట.