(Alert)
మీ మొబైల్ ఫోన్ కి ఇవాళ ఏదైనా మెస్సేజ్ వచ్చిందా? బజింగ్ సౌండ్ తో పాటు ఒక అలెర్ట్ మెస్సేజ్ వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి మీరు రిప్లయ్ఇ వ్వడంగానీ,రియాక్షన్ ఇవ్వడం గానీ చేయనక్కరలేదు…భారత టెలీకమ్యూనికేషన్ల శాఖ దేశ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్నానాన్ని మొబైల్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చి వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దానికోసం చిన్నప్రయోగం చేపట్టింది. ఢిల్లీ-NCR ప్రాంతంలో ఇవాళ చాలా మంది మొబైల్ ఫోన్లు బజింగ్ సౌండ్ తో మార్మోగాయి. చాలా మందికి కొన్ని మెస్సేజ్ లు కూడా వచ్చాయి. అయితే ఫోన్లకు ఇలాంటి సందేశాలు రావడంపై కొందరు మొబైల్ యూజర్లు కంగారు పడ్డారు కూడా.కానీ ఎలాంటి కంగారు, ఆతృత పడనవసరం లేదంటోంది భారత ప్రభుత్వం. ఇది సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ , ప్రభుత్వం కలసి సంయుక్తంగా చేసిన ఒక ట్రయల్. కేంద్రం త్వరలోనే పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ ను అమలు చేయాలని చూస్తోంది.దీనిని జాతీయ విపత్తు నివారణ శాఖ అమలు చేస్తుంది.
ప్రకృతి వైపరీత్యాలు,ఆకస్మిక విపత్తులు సంభవించినప్పుడు ఈ సిస్టమ్ ప్రజలను అలెర్ట్ చేస్తుంది. ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలో సూచిస్తుంది. శుక్రవారం ఢిల్లీ పరిసర ప్రాంతాల వారికి ఈ పాపప్ మెసేజ్ లు పెద్ద సౌండ్ తో మొబైల్ స్క్రీన్ పై రావడంతో కంగారుపడ్డారు. ఈ మేసేజ్ లు హిందీలోనూ, ఆంగ్లంలోనూ కూడా వచ్చాయి. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ అలెర్ట్ మెస్సేజ్ లు వచ్చేలా కంప్యూటర్ మెసేజ్ కోడింగ్ చేస్తున్నారు.ఎమర్జెన్సీ సందేశాలను మోసుకెళ్లే సామర్ధ్యం మన టెలికాం ఆపరేటర్లకు ఏ మాత్రం ఉందో పరీక్షించడానికే ఈ టెస్ట్ చేశారు.
సునామీలు, భూకంపాలు, భారీ వరదలు, వచ్చినప్పుడు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు అందరికీ సామూహిక అలెర్ట్ వార్నింగ్ ఇచ్చేవ్యవస్థను రూపొందిస్తున్నారు. అయితే ఈ అలెర్టులు అందరికీ ఒకేసారి రావు.. ఆగస్టు 17న కూడా ఇలాగే మరో ప్రాంతంలో ప్రభుత్వం టెస్ట్ చేసింది.
విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది (Alert)
విదేశాలు, ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అలెర్ట్(Alert) వార్నింగ్ వ్యవస్థ ఎప్పటినుంచో ఉంది. పర్యావరణ కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. కొన్ని చోట్ల తీవ్రమైన ఎండలు, మరికొన్ని చోట్ల దంచి కొట్టే భారీ వానలు ఇలా వాతావరణ సమతుల్యం దెబ్బతిని దాని ఎఫెక్ట్ ప్రజలపై పడుతోంది. ఆమధ్య ఉత్తరాదిని భారీ వర్షాలు కుదిపేశాయి. ఉత్తరాఖండ్ లో వరదలు వందల సంఖ్యలో ప్రాణాలు తీశాయి. భారీ వర్షాలకు అనేక ఇళ్లు కూలిపోయాయి. కోట్లల్లో ఆస్తి నష్టం సంభవించింది. ముందస్తు సమాచారం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇటు దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలను, తమిళనాడు, కేరళను అతి భారీ వర్షాలు,వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల ఆస్తులన్నీ నీళ్లపాలయ్యాయి. పిడుగులు పడి వేలల్లో జన నష్టం సంభవించింది. సామాన్య ప్రజానీకానికి ముందస్తు సమాచారం లేకపోవడం వల్లనే ఈనష్టం జరిగింది. అదే అలెర్ట్ వార్నింగ్ సిస్టమ్ ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న టెక్నాలజీని మన దేశంలో కూడా ప్రవేశపెట్టాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోగం చేసింది. ఇది సక్సెస్ అయితే కొంతలో కొంతైనా నష్టం తగ్గే అవకాశముంది.