(scrub typhus)
కరోనా నుంచి అది కలిగించిన నష్టంనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం.. ఆ వైరస్ జాడలు ఈ ప్రపంచంనుంచి పూర్తిగాపోలేదు. అమెరికాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయ్.. మన దేశంలో ఇప్పు కేరళను నిఫా వైరస్ ముప్పు భయపెడుతోంది. ఇప్పటికే ఇద్దరుచనిపోగా ఏడుగురు వైరస్ తో పోరాడుతున్నారు.మరింత మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ భయానికి తోడు ఇప్పుడు కొత్తగా మరో వ్యాధి భయపెడుతోంది. అదే స్క్రబ్ టైఫస్ ఫీవర్..
ఈ వ్యాధి బారిన పడి ఒడీస్సాలో ఇప్పటి వరకూ ఐదుగురు చనిపోయారు. ఈవిషయాన్ని ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ థృవీకరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ ఏడాది జనవరి నుంచి స్కృబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 132 కేసులు నమోదు అయిన్నట్టు తేలుస్తుంది. ఇటీవలే మరో వ్యక్తి చనిపోయాడు. ఈ ఆరుగురి ని ఓ ప్రైవేట్ క్లినిక్లో టెస్ట్ చేయగా పాజిటివ్గా తేలింది. కొద్ది రోజులకే వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలతో ఒక్కసారిగా ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సీజనల్ వ్యాధిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో పలు చోట్ల ఈ కేసులు నమోదవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తుగానే ఈ కేసులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని తేల్చి చెప్పింది. సరైన సయమానికి చికిత్స అందేలా చూడడం అందరి బాధ్యత అని స్పష్టం చేసింది. తగిన యాంటీబయాటిక్స్ మరియు తగినన్ని మందుల నిల్వలను ఉపయోగించాలని డిపార్ట్మెంట్ అధికారులను ప్రభుత్వం కోరింది.
స్క్రబ్ టైఫస్ వ్యాధి (scrub typhus)
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రృబ్ టైఫస్(scrub typhus) అనే కొత్త రకం జ్వరం వచ్చింది. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా అరుదుగా సంభవించినప్పటికీ ఈ జ్వరం చాలా కాలం పాటు కొనసాగితే అవయవ వైఫల్యానికి దారితీస్తుంది అంటున్నారు డాక్టర్ లు అంతేకాకుండా రోగి మరణానికి కూడా దారితీయవచ్చు అని తెలిపారు. కేసులు తక్కువగానే ఉన్నా దీనిని అంత తేలికగా తీసుకోలేమని వైద్యులు చెప్తున్నారు. అసలింతకీ దీని లక్షణాలు ఏమిటి ?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్క్రృబ్ టైఫస్ లక్షణాలు
డెంగ్యూ మాదిరిగానే.. స్క్రృబ్ టైఫస్తో(scrub typhus) బాధపడే రోగి శరీరంపై దద్దుర్లు వస్తాయి. జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ జ్వరం సాధారణంగా ఏడు రోజులు ఉంటుంది. కొంతమంది రోగుల్లో శ్వాసలోపం కారణంగా.. బహుళ అవయవ వైఫల్యం (multi organ failure) సంభవించే అవకాశం ఉంది. అటువంటి సందర్భాలలో వెంటిలేటర్, ఐసీయూ అవసరం. సకాలంలో పరిష్కరించకపోతే ప్రాణం కూడా పోవచ్చు.
ఈ వ్యాధుల వల్ల సంభవించే అన్ని మరణాలను పరిశోధించాలి. అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలి, అటువంటి వ్యాధులకు సంబంధించిన డేటాను SSUతో పంచుకోవాలి. క్రమం తప్పకుండా సూచించిన ఫార్మాట్ ని ఫాలో అవ్వాలని ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్క్రృబ్ టైఫస్ ని బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు, ఇది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. స్క్రృబ్ టైఫస్ వ్యాధి సోకిన వివిధ లార్వా పురుగులు మనుషులను కాటేస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. సాధారణంగాఎక్కువగా పొలాల్లో తిరిగేవారు, అడవుల్లో తిరిగే వారికి ఈ వ్యాధి సోకుతుంది. వారి ద్వారా ఇతరులకు రావొచ్చు…