అమెరికాలో రోడ్డు ప్రమాదంలోమరణించిన తెలుగు విద్యార్ధిని జాహ్నవి(Jahnavi) కందులకు మరణానంతరం డిగ్రీ పట్టా దక్కబోతోంది. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన చేశారు. ఆమె మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. చనిపోయిన తరువాత డిగ్రీ పట్టాను అందుకోవటం బాధాకరంగా ఉందని యూనివర్సిటీ యాజమాన్యం విచారం చేశారు. జాహ్నవి తరుపున ఆమె కుటుంబ సభ్యులకు ఎంఎస్ పట్టా అందజేస్తామని నార్త్ ఈస్టన్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. జాహ్నవి మరణం ఒక విషాద ఘటన…. యూనివర్శిటీ క్యాంపస్ లోని భారత విద్యార్థులను కదిలించిందని వర్సిటీ వీసీ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో వారికి తాము తోడుగా ఉంటామని అన్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులకు తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నామన్నారు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే…
కెవిన్ డేవ్ అనే పెట్రోలింగ్ అధికారి 119కిలోమీటర్ల వేగంతో పెట్రోలింగ్ వాహనాన్ని నడుపుతూ జాహ్నవిని ఢీకొట్టాడు. పై పెచ్చు నిలదీసిన వారితో మృతురాలిపై చులకనగా మాట్లాడాడు.. జాహ్నవి(Jahnavi) కందుల మృతి ఘటన లో సియాటిల్ నగరానికి చెందిన పోలీసు అధికారులు చులకగా మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. వీడియోలో సియాటిల్ నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి జోక్ చేస్తూ నవ్వుతూ మాట్లాడారు. ఆ మాట్లాలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. రక్షణ కలిపించాల్సిన పోలీసులే చులకనగా మాట్లాడటం ఏంటన్న అంశం అక్కడ భారతీయులనే కాదు.. యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఆ వీడియోను చూసిన భారత ప్రభుత్వం త్రీవంగా స్పందించింది. నాన్ అమెరికన్ల పట్ల అధికారులు అలా ప్రవర్తించిన తీరును అందరూ ఖండిస్తున్నారు.
వెలుగు లోకి తెచ్చిన భారత రాయబార కార్యాలయం …
ఈ వీడియో బయటకు రావటానికి కారణం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ సంఘటన పై పోలీసులు స్పందించాలని కోరింది.. అమెరికా వాళ్లకు భారతీయులంటే చులకనా? బహుశా అమెరికాలో ఎక్కువ శాతం భారతీయులు స్థిరపడుతున్నారని అమెరికా వాళ్లు జీర్ణంచుకోలేకపోతున్నారెమో. అందుచేత భారతీయ యువతి చనిపోయినా ఆమె గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారేమోఅని అక్కడి భారతీయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.ఏపీ కేంద్ర మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఈ విషయం పై స్పందించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. యూఎస్ లోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి వాస్తవాలు వెలికి తీసి మృతిరాలి కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
జాహ్నవి మృతిపై అప్పట్లోనే లేఖ రాసిన విదేశాంగ మంత్రి (Jahnavi)
జాహ్నవి మృతిపై కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. ఏపీ విద్యార్ధిని కందుల జాహ్నవి అమెరికాలో ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా…
వేగంగా వస్తున్న పోలీస్ వాహనం ఢీకొట్టి చనిపోయిన విషయాన్నితెలియచేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే ఆమె కుటుంబాన్ని,తెలుగు అసోసియేషన్ ను సంప్రదించి
ఆమె మృతదేహాన్ని కర్నూలు జిల్లా ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.