(MII)
దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. ట్రిపుల్ ఆర్ మూవీతో అస్కార్ అవార్డు సాధించి తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చెప్పాడు. అంతకుముందు బాహుబలి కూడా పాన్ ఇండియా కాదు పాన వాల్డ్ అన్న రేంజ్ లో నిలబడింది.రాజమౌళి ఏ ప్రాజెక్ట్ చేపట్టినా.. చాలా సీరియస్ గా చేస్తాడు. సినిమా మేకింగ్ అంటే జక్కన్న కి తపస్సు లాంటిది. మహాభారతం లాంటి ఎపిక్ మూవీ తీసి తన కెరీర్ ముగిస్తానని గతంలోనే ప్రకటించాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఆల్రెడీ మహేష్ బాబుతో మూవీకి కమిట్ అయ్యాడుగా.. మళ్లీ ఇదేంటి అనుకునే వారికి క్లారిటీ ఏంటంటే ఈ కొత్త ప్రాజెక్ట్ కు జక్కన్న నిర్మాత మాత్రమే.రాజమౌళి చిత్రాలకు ఎంత డిమాండ్ ఉన్న ఆయన నిర్మాతగా చేసింది ఒకటి రెండు చిత్రాలే. యమదొంగ చిత్రాన్ని విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించి దర్శకత్వం వహించాడు. తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ చేపట్టలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు.
మేడ్ ఇన్ ఇండియా (MII)
మేడ్ ఇన్ ఇండియా చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ గుప్త, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ కథాంశంగా తీసే ఈ సినిమాలో
ఇండియన్ సినిమాకు బీజం ఎలా పడింది. దశాబ్దాలుగా ఎదురైన ఒడిదుడుకులు, మార్పులు, అభివృద్ధి వంటి విషయాలు ఈ చిత్రంలో ప్రస్తావించే అవకాశం ఉందని రాజమౌళి తెలిపాడు.. అయితే నేను ఫస్ట్ టైమ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కథ విన్నప్పుడు భావోద్వేగానికి లోను అయ్యాను. బయోపిక్స్ తీయడం చాలా కష్టం అని రాజమౌళి వ్యాఖ్యానించారు. అందులోనూ ఫాదర్ ఆఫ్ ఇండియా సినిమా బయోపిక్ తీసి కన్వీన్స్ చేయడం మరింత కష్టం. అందుకు మా బాయ్స్ రెడీగా ఉన్నారు .. సగర్వంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాను ప్రజెంట్ చేస్తున్నా అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఇది ఇండియన్ మూవీ బయోపిక్
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో బయోపిక్స్ చూశాము ఇది ఇండియన్ సినిమా బయోపిక్ ఫస్ట్ ఇండియన్ మూవీ రాజా హరిశ్చంద్ర 1913లో విడుదలైంది. అంటే ఇండియన్ సినిమాకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా దాదా సాహెబ్ పాల్కే ఉన్నారు. మరి ఇండియన్ సినిమా బయోపిక్ మేడ్ ఇన్ ఇండియా లో ఏం చూపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. వెండితెరకు బయోపిక్స్ కొత్తేమి కాదు ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలను మన దర్శక రచయితలు, నిర్మాతలు తెరకెక్కించారు. వాస్తవ ఘటనలు, సంఘటనలు ఎన్నిటినో సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు. ఇప్పుడిక మేడ్ ఇన్ ఇండియా అనే ఫిలిం ఇండస్ట్రీ బయోపిక్ ను ఎలా తీస్తారో చూడాలి.
రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడంటే ఆ కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇలా అన్నింట్లోనూ ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. డైరక్టర్ ఇప్పటికే రాజమౌళి సలహాలు తీసుకుని ఉంటాడు. మరో వైపు ప్రిన్స్ మహేష్ బాబుతో రాజమౌళి మూవీ ఒకటి త్వరలో పట్టాలెక్కబోతోంది. విజయేంద్ర ప్రసాద్ సినిమాకు సంబంధించిన కథను తయరు చేసే పనిలో ఉన్నాడు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ రెడీ అవ్వలేదన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కే చాన్స్ ఉంది. ఈ ఏడాదిలోనే ఆ చిత్రానికి సంబంధించిన లాంచింగ్, పూజా కార్యక్రమాలు జరుగుతాయేమో చూడాలి.