22
చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ తో అంతరిక్షంలో భారత పతాకను ఎగరవేసిన మన ఇస్రో శాస్త్రవేత్తల బృందం మరో అద్భుతాన్ని సాధించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. చంద్రునిపై నిద్రాణ స్థితిలో ఉంచిన మన రోవర్ ప్రగ్యాన్, విక్రమ్ ల్యాండర్ లను నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రమండలంపై 14 రోజులకు ఒకసారి సూర్యోదయం అవుతుంది. అంటే అక్కడ పగలు నిడివి 14 రోజులు.. మనం చంద్రుడిపైకి రోవర్ ను ల్యాండర్ ను పంపినప్పుడు సరిగ్గా పగలు సమయం కొనసాగుతోంది. అందుకే మన రోవర్, ల్యాండర్ అక్కడ కొన్ని రోజులు పనిచేసి ఆపై సూర్యాస్తమయం కావడంతో నిద్రాణ స్థితికి చేరుకున్నాయి. ఇస్రో కేంద్రం నుంచే ఆ రెంటినీ జాగ్రత్తగా స్లీప్ మోడ్ లోకి ఆపరేట్ చేశారు మన సైంటిస్టులు.. ఇప్పుడు మళ్లీ 14 రోజుల రాత్రి తర్వాత చంద్రుని దక్షిణ థృవంపై సూర్యోదయం అవుతోంది. మరో రెండు రోజుల్లో అక్కడ సూర్యోదయం వెలుగు కనిపిస్తుంది. అక్కడ నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లను రీస్టార్ట్ చేయగలిగితే మరిన్ని పరిశోధనలు జరిపేందుకు వీలుంటుంది.
రాత్రి వాతావరణం తట్టుకోవడమే కీలకం 22
చంద్రమండలంపై రాత్రిపూట మైనస్ 200 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలుంటాయి. ఈ అతి భయంకరమైన చల్లదనాన్ని మన ల్యాండర్, రోవర్ తట్టుకుని నిలబడి ఆపై సూర్యరశ్మి ద్వారా వస్తున్న వెలుగును, వేడిని స్వీకరించి రీచార్జ్ అయితేనే మన ప్రయత్నాలు సక్సెస్ అయినట్లు. మన ల్యాండర్ ల్యాండ్ అయిన చోటునే మనం శివశక్తి పాయింట్ అని పిలుస్తున్నాం. ఇక్కడ సూర్యుని వెలుగు పడగానే ల్యాండర్ , రోవర్ రీచార్జ్ అవ్వాలి. అదే జరిగితే మన ప్రాజెక్ట్ మళ్లీ రీ స్టార్ట్ అయినట్లే.
రీచార్జ్ అయితే సక్సెస్ అయినట్లే
ఒక వేళ ల్యాండర్, రోవర్ పని ప్రారంభించకపోయినా వాటిని వేస్ట్ మెటీరియల్ గా పరిగణించకూడదు. అవి చంద్రుని ఉఫరితలంపై అలా శాశ్వత గుర్తులుగా ఉంటాయి. జాబిల్లిపై అన్వేషణలో మన దేశం సాధించిన విజయానికి గుర్తుగా వాటిని మనం భావించవచ్చు. ఈ 14రోజులూ ల్యాండర్, రోవర్ మంచులో కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాయి. వాటిని ముందుగానే స్లీప్ మోడ్ లోకి మార్చడం వల్ల అవి పనిచేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈనెల22 నుంచి మళ్లీ సూర్యోదయం ప్రారంభం వల్ల ఆ వేడికి అవి చార్జింగ్ అయ్యాక ఆన్ అవుతాయని భావిస్తున్నారు. మన అంచనాలు ఫలించి అవి పనిచేస్తే అక్కడి వాతావరణాన్ని మరింత స్టడీ చేసే అవకాశం మనకు దొరికినట్లే.
ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చిన రోవర్ 22
రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే చంద్రమండల భౌతిక పరిస్థితిపై కీలక సమాచారం షేర్ చేసింది. చంద్రుని దక్షిణ థృవం పై సిలికా, కాల్షియం, హైడ్రోజన్, ఆక్సిజన్, హీలియం సహా అనేక విలువైన మూలకాలు ఉన్నట్లు కనుగొన్నారు. వాటి వివరాలను ఇప్పటికే ఇస్రో భూ కేంద్రానికి పంపింది. హీలియం-3 అనే ఖనిజం అక్కడ పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనల్లో బయటపడింది. హీలియం-3 అణు విచ్ఛిత్తి పరిశోధనలకు కీలకమైన ఖనిజం. దీనిని ఛేదించగలిగితే భవిష్యత్ ఇంధన అవసరాలకు, అణుఉత్పాదక శక్తికి ఉపయోగపడుతుంది. చంద్రునిపై నివసించేందుకు అవసరమైన ఆక్సిజన్ తయారీలో కీలక మూలకాలలో ఒకటి హీలియం-3.. దానిని ఆధారం చేసుకుంటే మానవ ఆవాసాలకు బాటలు వేసే ఆస్కారం ఉంది. 22