(world cup)
ఆసియా కప్ సాధించిన దూకుడు మీదున్న టీమిండియా వాల్డ్ కప్ కోసం సమాయత్తమవుతోంది. ప్రపంచ కప్ ను గెలిస్తే ఆ మజాయే వేరు. టీమిండియా కుర్రోళ్లు అందుకే ప్రపంచ కప్ టైటిల్ కోసం కదనరంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నారు.
ఇండియా వేదికగా అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ సీరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ షెడ్యూల్ను మంగళవారం
ఐసీసీ రిలీజ్ చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ప్రారంభిస్తారు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మొత్తం 45 రోజుల పాటు వరల్డ్ కప్ సమరం కొనసాగుతుంది. నవంబర్ 15,16వ
తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
భారత్ లో పది స్టేడియాంలల్లో మ్యాచులు (world cup)
మన దేశంలో 10 స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 45 రోజుల పాటు మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను
అలరించనుంది. ఈ టోర్నీ మొత్తం భారత్లోనే జరగనుంది. ఇలా వరల్డ్ కప్కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం
ఇవ్వబోతోంది. వరల్డ్ కప్ షెడ్యూల్ను బీసీసీఐ తొలుత ఐసీసీతో పంచుకుంది. తర్వాత మిగతా దేశాలకు పంపి వారి నుంచి
ఫీడ్బ్యాక్ తీసుకున్నాక వరల్డ్ కప్ ఫైనల్ షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ మెగా
టోర్నీలో క్వాలిఫయర్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కూడా టోర్నీకి అర్హత సాధిస్తాయి. టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్
ఫార్మాట్లోమ్యాచులు జరగనున్నాయి. మొత్తం పది టీమ్లు ఉండగా ఒక జట్టు మిగతా 9 టీమ్లతో లీగ్ దశలో తలపడనుంది.
లీగ్ దశ ముగిసే సరికి టాప్ 4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి.
ఐ సీ సీ స్పాన్సర్స్
దేశీయ మార్కెట్ లో తమ బ్రాండ్ విలువను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 కి స్టార్ స్పోర్ట్స్తో కలిసి అసోసియేట్ స్పాన్సర్గా మహీంద్రా వ్యవహరించనుంది.
దీంతో తమ కార్ల అమ్మకాలను పెంచుకోవాలని మహీంద్రా భావిస్తోంది.భారత్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట్ ద్వారా ప్రజల్లోకి
మరింత వెళ్లేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఇక డిజిటల్ ప్లాట్ ఫాం ‘డిస్నీ+ హాట్ స్టార్’
కూడా వరల్డ్ కప్కు స్పాన్సర్ గా ఉండనుంది.మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్ల ఆధ్వర్యంలో ఈవెంట్లు ఈ నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్ల ఆధ్వర్యంలో కొన్ని ఈవెంట్లను నిర్వహించనుంది.ఇక మహీంద్ర కంపెనీ ఆటో మొబైల్, ఫార్మింగ్ సెక్టార్లలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం చేపాల్సిన అవసరం లేదు.
భారిగా టికెట్ అమ్మకాలు
అభిమానులకు ఇబ్బందులు కలగకుండా టికెట్ అమ్మకాల ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించడానికి పలు నిర్ణయాలు
తీసుకున్నారు. ప్రపంచ కప్ టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి అన్ని బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ క్రికెట్లోనే
అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన మ్యాచు భారత్ పాకిస్థాన్ మ్యాచ్.
ఈ మ్యాచ్ కోసమే ఉత్కంఠ
వేదిక ఎక్కడైనా దాయాదుల పోరు జరుగుతుందంటే ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. సాధ్యమైన వారు మైదానానికి
వెళ్లి మ్యాచులు చుస్తారు. వీలుకాని వారు చక్కగా ప్లాన్ చేసుకొని ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా టీవీలకు అతుక్కుపోతారు.
భారత్-పాక్ మధ్య మ్యాచుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. మెజార్టీ టికెట్లు రూ.లక్షకు పైచిలుకు
ధరలుగా వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. అందులో రూ.18 లక్షలు, రూ.19 లక్షలు, రూ.21 లక్షలు, రూ.22 లక్షలు వంటి
ధరలు కనిపిస్తున్నాయి. మరికొన్ని టికెట్ల ధర రూ.45 లక్షలుగా చూపిస్తోంది. ఇప్పటి వరకూ వాల్డ్ కప్ చూసేందుకు పలికిన
అత్యధిక టికెట్ రేట్ 57 లక్షలు.. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడూ టిక్కెట్ ధర పలక లేదు. అయితే భారత్-ఆస్ట్రేలియా
మధ్య జరిగే మ్యాచు టికెట్లు సైతం రూ.4 లక్షల పైచిలుకు ధరలు చూపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో మ్యాచుకు టికెట్ ధరలు
రూ.2.3 లక్షలకు పైగా ఉన్నాయి. టికెట్ల ఈరేట్లు ఈ రేంజ్లో ఉండటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ స్టార్ రజనీ కాంత్ కి గోల్డెన్ టికెట్ (world cup)
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీ అంటే కోట్లాది మంది అభిమానులు ఇష్టపడతారు. కొందరు ఏకంగా ఆరాధిస్తారు. కాగా రజినీకాంత్కు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. కొన్నిసార్లు
ఆయన స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్లు చూస్తుంటారు. ముంబైలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్కు కూడా ఆయన
హాజరయ్యారు. ఆ ప్రపంచకప్ను టీమిండియా గెలువగా ఆయన చాలా సంతోషించారు. కాగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ అక్టోబర్
5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య భారత్ వేదికగా జరగనుంది. ఈ తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు బీసీసీఐ
రజినీకి ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది. 2023 ప్రపంచకప్ గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ రజినీకి అందించింది. దీన్ని బీసీసీఐ
కార్యదర్శి జైషా అధికారికంగా ప్రకటించారు.