సహజ నటి జయసుధ(Jayasudha) మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? కారణం తెలియనప్పటికీ నెట్టింట ఈ పుకార్లు మాత్రం ఊపందుకున్నాయి. ఎన్నో పాత్రలను అలవోకగా పోషించి తెలుగు వారి మనసుల్లో సుస్థర స్థానం సంపాదించుకున్న జయసుధ ఈ మధ్య సోషల్ మీడియా న్యూస్ మేకర్ గా మారారు. కారణం తరచుగా ఆమె ఫిలిప్ రూల్స్ అనే వ్యక్తి ని వెంట పెట్టుకు తిరుగుతున్నారు. పార్టీలైనా, మీటింగులైనా, సన్నిహితులతో సరదా సమావేశాలైనా పక్కన ఆ వ్యక్తి లేకుండా మాత్రం ఆమె కనిపించడం లేదు.. ఇన్నాళ్లు ఒంటరిగా కనిపించిన జయసుధ ఇప్పుడు ఇలా జంటగా కనిపించడానికి కారణమేంటన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ..
తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లోనూ జయసుధ వెంట ఆ వ్యక్తి ఉన్నాడు. అన్న పూర్ణ స్టూడియోలో ఏఎన్ ఆర్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుకలో జయసుధతో పాటు ఫిలిప్ రూల్స్ కూడా పాల్గొన్నాడు. ఇలా జయసుధతో ప్రతి కార్యక్రమంలో ఫిలిప్ కనిపించడంతో జయసుధ అతగాడిని మూడో పెళ్లి చేసుకుంటున్నారంటూ పుకార్లు షికారు చేయడం మొదలెట్టాయి..
ఇలా పుకార్లు రావడానికి అసలు కారణం వేరే ఉంది. ఈ మధ్య కాలంలో జయసుధ ఏ కార్యక్రమానికి వెళ్లినా వెంట అమెరికాకు చెందిన ఫిలిప్ రూల్స్ ప్రత్యక్ష మవుతున్నాడు.మొన్నటికి మొన్న కమెడియన్ అలీ కూతురి పెళ్లికి కూడా అతడిని వెంట తీసుకుని వెళ్లింది. వారసుడు ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా జయసుధ పక్కన అతడే ఉన్నాడు.దీంతో జయసుధ మూడో పెళ్లి నిజమే అయి ఉంటుందన్న భావన మొదలైంది.
అయితే తనపై వస్తున్న పుకార్లు చూసి ఆశ్చర్యపోయిందామె. ఫిలిప్ రూల్స్ ఒక అమెరికన్ అని.. తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చాడనీ క్లారిటీ ఇచ్చింది జయసుధ..ఇండస్ట్రీలో తనకున్న వాల్యూ, పరిచయాలను అంచనావేయడానికి బయోపిక్ నిర్మాణంలో భాగంగానే ప్రతీ కార్యక్రమానికి తనతో వస్తున్నట్లు వివరణ ఇచ్చారామె.
ఇంటర్ నెట్ లో తన గురించి సెర్చ్ చేసిన ఫిలిప్ సినిమా షూటింగ్ లలో తానెలా ఉంటారు,తన ప్రవర్తన, పరిచయాలు గట్రా తెలుసుకోడానికి అబ్జర్వేషన్ కోసం తనవెంట వస్తున్నట్లు తెలిపారు. ఇవన్నీ బయోపిక్ తీయడంలో భాగమేనన్నారామె.
వైవాహిక జీవితంలో ఒడి దుడుకులు (Jayasudha)
జయసుధకు గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట1982లో రాజేంద్ర ప్రసాద్ అనే వ్యాపార వేత్తతో పెళ్లి కాగా ఆ మ్యారేజ్ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ తో 1985 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. అనారోగ్య సమస్యల కారణంగా నితిన్ కపూర్ 2017 లో భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మరణించారు. అప్పటినుంచి జయ సుధ ఒంటరి జీవితమే గడుపుతున్నారు. కరోనా సమయంలో మానసికంగా బాగా దెబ్బతిన్నారు. ఆపై కొంత కాలం అమెరికాలో ఉండి కోలుకున్నారు.
కలసి రాని రాజకీయాలు
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగు దేశం, ఆ తర్వాత వైసీపీలలో చేరినా ఏ పార్టీ ఆమెకు సముచిత హోదా, స్థానం కల్పించలేదు.దాంతో ఇటీవలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.
సికింద్రాబాద్ లేదా ఖైరతాబాద్ నియోజక వర్గాలనుంచి బీజేపి టిక్కెట్ పై బరిలో నిలబడాలని ఉవ్విళ్లూరుతున్నారు.వయసు మళ్లినా జయసుధలో అందం, బిడియం తగ్గలేదు.ఇప్పటికీ భార్య, మేనత్త,లాంటి పాత్రల్లో ఆమె ఒదిగిపోయినంతగా మరే ఆర్టీస్టూ ఒప్పించలేరు. ఐదు దశాబ్దాల ఆమె నట జీవితం 13 ఏళ్ల వయసు నుంచే ప్రారంభమైంది. 1972 లో వచ్చిన పండంటి కాపురం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన జయసుధ విభిన్న పాత్రలలో నటించి ఎందరో స్టార్ హీరోల సరసన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.