ACB
స్కిల్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ మరో రెండు రోజులు పొడిగించారు. మరోవైపు చంద్రబాబుపై పెట్టిన కేసు తప్పుడు కేసని ఆయనపై కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టు లో టీడీపీ లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తుందా? ఏసీబీ కోర్టు కూడా హైకోర్టు క్వాష్ పిటిషన్ పై తీర్పు కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ వేసిన పిటిషన్ పై కూడా తీర్పు ఈ మధ్యాహ్నమే రానుంది. హై కోర్టు క్వాష్ పిటిషన్ పై ఇచ్చే తీర్పు తర్వాతే ఏసీబీ కోర్టు తన జడ్జిమెంట్ ను వెలువరించే అవకాశముంది. తాజా పరిణామాలతో తెలుగు తమ్ముళ్లు బాగా డీలా పడిపోయారు.
అసెంబ్లీలో రచ్చ రచ్చ
ఇవాళ అసెంబ్లీలో కాగానే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నానా యాగీ చేశారు. హిందూ పురం ఎమ్మెల్యే బాలయ్య ఏకంగా అసెంబ్లీలో విజిల్ వేసి తన నిరసన తెలపడం విచిత్ర పరిణామం.. అధినేత జైలులో ఉండటంతో తెలుగు తమ్ముళ్లు దిశా నిర్దేశం లేక అయోమయంలో ఉన్నట్లుగా తెలుగు దేశం ఎమ్మెల్యేల చర్యలు కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా అసెంబ్లీ పోడియం వద్ద తెలుగు తమ్ముళ్లు ధర్నా చేశారు. ఇవాళ కూడా చంద్రబాబు అరెస్టుపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది టీడీపీ. అయితే స్పీకర్ దానిని తిరస్కరించడంతో పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దాంతో వారిని స్పీకర్ ఇవాళ కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.దాంతో తామే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించి అసెంబ్లీనుంచి బయటకు వచ్చేసింది.
నా ఆవేదన, ఆక్రందన అర్ధం చేసుకోండి… ACB
అంతకుముందు చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి విచారించినప్పుడు తనను జైలులో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు కామెంట్ చేశారు. తాను 45 ఏళ్లుగా రాష్ట్రానికి ఎంతో సేవ చేసినట్లు తన, అభివృద్ధి కంటికి కనిపిస్తోందనీ చెప్పుకొచ్చారు. స్కిల్ స్కామ్ లో తాను నిర్దోషినని తన అరెస్టు అక్రమమనీ వేడుకున్ను. 73 ఏళ్ల వయసులో తనకు అతిపెద్ద పనిష్మెంట్ ఇచ్చారని తనపై ఉన్న ఆరోపణలు నిర్దారణ కాలేదనీ అన్నారు. చట్టాన్ని గౌరవిస్తాననీ, న్యాయం గెలవాలనీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తితో అన్నారు.
ఇది శిక్ష కాదు.. పోలీస్ కస్టడీలో మీరు లేరు. మీరున్నది జ్యుడీషియల్ కస్టడీలో.. ఇది శిక్షగా భావించవద్దు. నేర నిరూపణ ఇంకా జరగలేదు. చట్టం నిబంధనల ప్రకారమే రిమాండ్ లో ఉంచామంటూ న్యాయమూర్తి బదులిచ్చారు. 24 వరకూ జ్యుడీషియల్ కస్టడీ లో ఉంటారని జైలులో అసౌకర్యాలుంటే వాటిని పరిష్కరిస్తామనీ ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు.
లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం?
తాజా పరిణామాలను చూస్తుంటే చంద్రబాబును సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు ఆయన్ను కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. అయితే కస్టడీ అవసరం లేదంటూ టీడీపీ తరపు లాయర్లు వాదించారు. ఇక ఢిల్లీలోనే మకాం పెట్టిన టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసుల టీమ్ ఢిల్లీ బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత కు సంఘీభావాన్ని, మద్దతును కూడగట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న లోకేష్ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో లోకేష్ హస్తమున్నట్లు ఇప్పటికే సీఐడీ ప్రకటించింది.