మన శరీరానికి ఆరోగ్యకరమైన మరియు పోషక విలువలు ఉన్న ఆహారం ఎంతో అవసరం.ఇలాంటి ఆహారాన్ని ప్రతి రోజు తీసుకోవడం వలన పౌష్టికాహార లోపం లేకుండా,అనారోగ్య బారిన పడకుండా ఉండచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరమట.ఇలా మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తింటే మధుమేహం,గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని 40% వరకు తగ్గించవచ్చట. ఇప్పటి రోజుల్లో చాలా మంది డైట్ పట్టిస్తున్నామని ఆహారాన్ని సరైన పద్దతి లో తీసుకోలేకపోతున్నారు.
అందు వాళ్ళ చాలా మందికి పోషకాహారం తినడమే కాదు అవి వీటిలో ఉంటాయో కూడా సరైన అవగాహనా లేదంటున్నారు డాక్టర్లు. ఇలా పోషక విలువలు ఉన్న ఆహారం మీద ప్రజలకి అవగాహాన కల్పించేందుకు ప్రతి ఏటా సేపేటెంబేర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుతుంటారు. ఎంత డైట్ పాటించిన శరీరం ఆరోగ్యం గా దృఢం గా ఉండాలంటే “రెయిన్ బో డైట్” (Rainbow Diet) ని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రెయిన్ బో డైట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అసలు రెయిన్ బో డైట్ (Rainbow Diet) అంటే ఏమిటి ? అందులో ఏ ఏ ఆహారాలు ఉంటాయో తెలుసుకుందామా..!
రెయిన్ బో డైట్..
ఈ రెయిన్ బో డైట్ (Rainbow Diet) మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమట. రెయిన్ బో డైట్ అంటే వివిధ రకాల పండ్లు, కాయకురాల సమ్మెళనం. అంటే అనేక విటమిన్లు , అంటి ఆక్సిడెంట్లు , ఖనిజాలు పుష్కలం గా ఉండె వివిధ రకాల రంగుల్లో ఉన్నవిగా చెబుతున్నారు. అంటే రెయిన్ బో అంటే ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు లో 7 రంగులుంటాయని మన అందరికి తెలిసిందే. ఆలా 7 రంగుల్లో లో ఉన్న పండ్లు కూరగాయాలు తో కూడినదే ఈ రెయిన్ బో డైట్ (Rainbow Diet).
రెయిన్బో డైట్ ఆహారం ..
1. ఎర్రని పండ్లు, కాయగూరలు..
రేపు రంగు లో ఉన్న పండ్లు, కూరగాయలు అంటే ఆపిల్,టమోటా,స్ట్రాబెర్రీ వంటివి. వీటిలో విటమిన్లు,పోషక విలువలు సమృద్ధి గ ఉంటాయి. ఆపిల్ మీద ఆంగ్లం లో ఓ నానుడి కూడా ఉంది “An Apple A Day Keeps Doctor Away..!” అని అంత మేలు చేసే ఈ పండ్లను కూరగాయలను మన రోజువారీ ఆహరం లో చేర్చుకుంటే మనకు వీటిని నుంచి వచ్చే పోషక విలువల తో ఆరోగ్యంగా ఉండవచ్చట
2. ఆరంజ్ రంగు పండ్లు, కాయగూరలు..
ఎరుపు రంగు పండ్ల తో పాటు ఆరంజ్ రంగు పండ్లు కాయగూరలు కూడా మనం రోజువారీ ఆహారం లో చేర్చుకోవాలట. నారింజ మరియు ఎర్రని పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుందట. నారింజ,బొప్పాయి పండ్లు,కార్రోట్ వంటి కూరగాయలు మన రోజువారీ డైట్ లో భాగం గ తీసుకోవడం వలన నోటిలోని లాలాజల గ్రంధులు ఉత్తేజం అవ్వడం తో పాటు ఇవి కంటి చుపిని మెరుగుపరిచేందుకు కూడా తోడ్పడతాయట.
3. తెలుపు రంగు పండ్లు, కాయగూరలు..
తెలుపు రంగు పండ్లు,కూరగాయలు మన శరీరం లో ని చేదు కొలెస్ట్రాల్ ను తగ్గించడం తో పాటు రక్తపోటును కూడా తగ్గించి రోగనిరోధక శక్తీ ని పెంచుతూ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట.అరటిపండు,సీతాఫలం వంటి పండ్లు,కాలీఫ్లవర్, మూర్లంగి వంటి కూరగాయలు డైట్ లో చేర్చుకోవడం వలన కొన్ని రకాల క్యాన్సర్ల కు దూరంగా ఉండొచ్చట.
4. ఆకుపచ్చ రంగు పండ్లు,కూరగాయలు..
ఆకుపచ్చ రంగు లో ని కూరగాయలో శరీరానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు వింటాయట. ఆకురాల్లో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుందట. ఈ విటమిన్ గ్రాభిణులకు బిడ్డ ఎదుగుదలలో ఎంతో ఉపకరిస్తుందట. అలాగే ఆకుపచ్చ రంగు లో ఉండే క్యాప్సికమ్ ,కాకరకాయబీన్స్, చిక్కుడుకాయ, కీరకాయ,బ్రోకలీ, జామపండు, చీని పండు లో ఎన్నో రకాల పోషక విలువలతో పాటు విటమిన్ కూడా ఉంటాయట.
5. పర్పుల్ రంగు పండ్లు,కూరగాయలు..
ద్రాక్ష,నేరేడు పండ్లు,బ్లూ బెర్రీ పండ్లు,వంకాయ,బీట్ రూట్ వంటి కూరగాయలు శరీరం లో ని రక్తాన్ని సుద్ధి చేసి ఇవి అంటి ఇన్ఫ్లమేటరి గా పనిచేస్తాయట. అందువలన కచ్చితంగా వీటిని మన ఆహరం లో చేర్చుకోవాలట.
6. సిరి ధాన్యాలు..
సిరి ధాన్యాలు వాటినే మనం చిరు ధాన్యాలు అని కూడా అంటాము.మునుపటి రోజులు కంటే ఇప్పుడు వీటి గురించి తెలిసిన వారి సంఖ్యా ఎక్కువనే చెప్పాలి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు,డెప్త్ పాటించేవారికి కూడా డాక్టర్లు ఇప్పుడు అన్నానికి బదులు గా సిరి ధాన్యాలు తినవలసిందిగా సూచిస్తున్నారు.ఎందుకంటే ఇవి ఎక్కువ సేపు పొట్ట నుండు గ ఉంటూ త్వరగా ఆకలి వెయ్యకుండా శక్తీనిస్తుందని చెబుతున్నారు.
7. డ్రై ఫ్రూప్ట్స్,గింజలు…
బాదం,జీడిపప్పు,ద్రాక్ష పిస్తా వంటి డ్రై ఫ్రూప్ట్స్, గుమ్మడి గింజలు,చిత్ గింజలు,దోస గింజలు,అవిసె గింజలు ని పొద్దున తినడం వలన నీరసం లేకుండా శరీరానికి అవసరమైన శక్తినిస్తుందట. వీటిలో ని ఫైబర్ మెదడుకు
8. ప్రోటీన్ ఆహారం..
చేపలు,కోడి మాంసం,కోడి గుడ్లు,పాలు,చిక్కుడుకాయలు వంటి ఆహార పదార్థాలను రోజువారీ ఆహారం లో చేర్చుకోవడం వలన శరీరం దృడంగా ఉంటూ శరీరానికి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ ను అందిస్తుందట.