Asian Games
ఏసియన్ గేమ్స్ లో రెండో స్వర్ణం సాధించి భారత్ తన దూకుడును ప్రదర్శించింది.అంతకుముందు ఎయిర్ రైఫిల్ గన్ షూటింగ్ లో మనకు ఒక స్వర్ణం రావడం మినహా భారత క్రీడాకారుల ప్రభావం అంతంత మాత్రమేనని చెప్పాలి.ఏసియన్ గేమ్స్ – 2023లో వంద పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతోంది.ఆదివారం ఐదు పతకాలు నెగ్గిన భారత్ రెండో రోజు మరో ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది. షూటింగ్లో భాగంగా భారత షూటర్లు సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించారు. తాజాగా ఉమెన్స్ క్రికెట్ టీ20 టోర్నీ ఫైనల్లో భారత మహిళా జట్టు శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి పసిడి పతకం గెలిచింది. ఈరోజు జరిగిన ఆఖరి పోరులో టాస్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు భారత్ ఖాతాలోకి రెండో స్వర్ణంని చేర్చారు.
ఆదివారం రోయింగ్లో రెండు రజతాలు ఓ కాంస్యం నెగ్గిన భారత్ నేడూ మరో ఐదు పతకాలు గెలుచుకుంది. రోయింగ్ మెన్స్ క్వాడ్రపుల్ స్కల్స్ ఈవెంట్లో భాగంగా మన ఆటగాళ్లు సత్నాం సింగ్, ప్రమిందర్ సింగ్, జకర్ ఖాన్, సుఖ్మీత్ సింగ్లు కాంస్యం నెగ్గారు. అంతేగాక మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్, మెన్స్ కాక్స్డ్ ఎయిట్ విభాగాల్లో రజత పతకాలను కూడా గెలుచుకుంది. ఈ విభాగంలోనే భారత్కు ఐదు పతకాలు వచ్చాయి.
డ్రాగన్ కంట్రీలో మూడోసారి Asian Games
ఏషియన్ గేమ్స్కు చైనా అతిథ్యం ఇవ్వడం ఇది మూడో సారి. 1990లో బీజింగ్లో, 2010లో గాంగ్జౌలో పోటీలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అదే చోట పోటీలు నిర్వహిస్తున్నారు. ఈపోటీలలో చైనాతో సహా మరో నాలుగుదేశాలు టాప్ ఫోర్ లో ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్ సమానంగా పోటీపడుతున్నాయి. ఇక భారత దేశం పెర్ఫార్మెన్స్ చూస్తే గత ఏసియన్ గేమ్స్ తో కలుపుకుంటే ఇప్పటివరకు 672 మెడల్స్ సాధించింది. అందులో 155 స్వర్ణాలు, 201 రజతాలు, 316 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా సాధంచిన పతకాల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది.
45 దేశాలు.. 12 వేల మంది అథ్లెట్లు Asian Games
ఈ క్రీడల్లో మొత్తంగా 45 దేశాలకు చెందిన 12 వేల మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఒలింపిక్స్ కన్నా ఏషియన్ గేమ్స్లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్లో 11 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొనగా 2018లో ఏషియన్ గేమ్స్లో 11 వేల మంది అథ్లెట్లు పోటీలో నిలిచారు. ఈసారి 40 క్రీడలకు సంబంధించి 61 క్రీడాంశాల్లో 481 గోల్డ్ మెడల్స్ అందుబాటులో ఉన్నాయి. 1982 నుంచి ప్రతీసారి పతకాలలో చైనాదే అగ్రస్థానం.
మన ఆశలన్నీ అథ్లెటిక్స్ పైనే
ఈ క్రీడల్లో భారత్ ప్రధానంగా అథ్లెటిక్స్పైనే భారీ ఆశలు పెట్టుకుంది. 2018లో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 8 స్వర్ణాలు సహా 20 మెడల్స్ సాధించారు. 2018లో గెలిచిన గోల్డ్ను నిలబెట్టుకోవాలని అశ పడుతోంది.
చదరంగం, కబడ్డీ, హాకీ, క్రికెట్లో భారత్కు తిరుగులేకపోగా షూటింగ్ లో రికార్డులు తిరగరాసేందుకు భారత ప్లేయర్లు సిద్ధమయ్యారు.
2024లో పారిస్లో జరిగే ఒలింపిక్స్కు నీరజ్ చోప్రా అర్హత సాధించాడు. ఒలింపిక్స్ అర్హత కోసం ఇప్పటికే 85.50 మీటర్ల దూరాన్ని నిర్ణయించగా దాని ప్రకారం నీరజ్ చోప్రా ఫైనల్ కు క్వాలిఫయింగ్ రౌండ్లో 88.77 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరి నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధించాడు.
ఒలింపిక్స్ తర్వాత దాదాపు అన్నిరకాల క్రీడలను కవర్ చేస్తూ సాగే ఈ మెగా వెంట్ ఆసియా క్రీడలు. కానీ క్రీడాకారుల ప్రకారం చూస్తే ఒలింపిక్స్ లో కంటే ఈ ఏడాది ఆసియా క్రిడలలో ఎక్కువ మంది పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో సుమారు 10,500 మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.