(LIFE)
మన శరీరంలో గుండెకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే
మనిషి బతకడం ఖాయం.. దీన్నే వైద్య పరిభాషలో గోల్డెన్ పిరియడ్ అంటారు. అలాగే మనకు
పక్షవాతం సోకినా.. అది కూడా గంటలోపు వైద్యుని సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి
అంటున్నారు వైద్యులు..బ్రెయిన్ స్ట్రోక్గా పిలిచే పక్షవాతం మన దేశంలో సగటున 10 శాతం మంది కి
సోకుతోంది.. ఇది వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అసలు పక్షవాతం రావడానికి గల కారణాలను పరిశీలిస్తే…
మన వయస్సు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అందులో పక్షవాతం కూడా ఒకటి.
మెదడుకు రక్తప్రసరణ తగ్గడం, రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది కొంతమందిలో
తక్కువ ప్రభావం చూపినా మరి కొంత మందిలో తీవ్రంగా మారి వాళ్లని మంచానికే పరిమితం చేస్తుంది.
సాధారణంగా పక్షవాతం మెదడుకి అందాల్సిన రక్తం అందకపోవడం వల్ల వస్తుంది. మెదడులోని
కణాలు చనిపోయినప్పుడు కూడా పక్షవాతం వస్తుంది. దీనిని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు.
దాదాపు మన శరీరంలో వచ్చే 98 శాతం ఆరోగ్య సమస్యలకి అధిక బరువే కారణం. ఈ అధిక బరువు
సరైన జీవన శైలి లేకపోవడం నిద్ర , ఆహారం విషయంలో పోషకాహారం తీసుకోకపోవడం వల్ల
వస్తుంటాయి. ఈ కారణంగానే పక్షవాతం కూడా వస్తుంది. వెంటనే వైద్యం అందకపోతే శాశ్వతంగా
వికలాంగులు అయిపోయే అవకాశం ఉంది. ఒకొక్కసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది.
పక్షవాతానికి దారి తీసే కారణాలు… (LIFE)
పక్షవాత లక్షణాలు మొదలైన తొలి గంట ఎంతో విలువైన సమయం. ఎందుకంటే ఆ సమయంలో
చికిత్స మొదలు పెడితే చాలా వరకు కోలుకునే అవకాశముంది. మెదడు ఎక్కువ దెబ్బతినకుండా
శాశ్వత వైకల్యం బారినపడకుండా కాపాడుకొవచ్చు. పక్షవాతం వచ్చినప్పుడు శరీరంలో ఒక కాలు
ఒక చెయ్యి కాని రెండుకాళ్లు గాని చచ్చుబడిపోతాయి. ఇలా ఎక్కువగా రక్తపోటు అయినప్పుడు అంటే
బీపీ విపరీతంగా పెరిగితే మెదడు చచ్చుబడిపోతుంది.. మాటకూడా పడిపోతుంది.
ఇది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేది. కాని ఇప్పుడు నలభై ఏళ్ల వారికి కూడా వస్తుంది..
దీనికి కారణం మానసిక వత్తిడి . ఒకసారి పక్షవాతం వస్తే సరైన చికిత్స తీసుకుంటే మూడు నుంచి
ఆరు నెలల సమయంలో రోగి కోలుకుని. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు. పక్షవాతం రావడానికి
గల కారణాలు అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నాడి దౌర్బల్యము, నిద్రలేమి, అతి వ్యాయామం,
బరువులు ఎత్తడం, అతిగా మాట్లాడడం, మద్యపానం, ధూమపానమని వైద్య నిపుణులు
చెబుతున్నారు.
పక్షవాతపు లక్షణాలు…
పక్షవాతం అందరిలో ఒకేలా ఉండాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కోక్కలాగా ఉంటాయి. అకస్మాత్తుగా
కాలు, చేయి పనిచేయకుండా పోవడం, నోరు వంకరగా అవ్వడం, అధిక రక్తపోటు, ముఖం ఓ వైపుకి
ఉండడం, చూపు తగ్గడం భరించలేని తలనొప్పి, తల తిరగడం, వాంతులు నడవలేకపోవడం ఇవన్నీ
లక్షణాలే.. ఈ లక్షణాల్లో అందరికీ అన్ని ఉండవు. వీటిలో దేనిని గుర్తించినా డాక్టర్స్ ని వెంటనే
సంప్రదించాలి. 45 ఏళ్లు పైబడిన వారిలో రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పక్షవాతం వచ్చే అవకాశం
మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది పురుషులు మద్యపానం,
ధూమపానం చేస్తుంటారు. దీంతో పురుషులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.
TPA ఇంజెక్షన్ తో రిలీఫ్
మనం ఈ లక్షణాలు గమనించినా వెంటనే 3 గంటల్లోపే డాక్టర్ దేగ్గరికి వెళ్ళాలి లేకపోతే మెదడులోని
కణాలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా ఆ కణాలు తిరిగి
బతకలేవు. కాబట్టి, పక్షవాతం వచ్చిన మొదటి 3 గంటల్లోపే హాస్పిటల్ కి వెళితే డాక్టర్స్ టిష్యూ
ప్లాస్మినోజన్ యాక్టివేటర్ TPA అనే ఇంజెక్షన్ ఇస్తారు. దీని వల్ల రక్తనాళాలు సరిగ్గా పనిచేసి
మెదడుకి రక్తం సరఫరాని అందిస్తాయి. ఈ TPA ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు 50 శాతం
పేషెంట్స్ వెంటనే కాలు, చేయి పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా మారకుండా ఉంటుంది అలాగే త్వరగా
కోలుకుంటారు. ఎంత త్వరగా వీలైతే అంత ముందు ఈ ఇంజెక్షన్ చేయిస్తే త్వరగా కోలుకుంటారని
డాక్టర్ చెబుతున్నారు. అయితే, పక్షవాతానికి వేసే టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ని
తీసుకోవడం వల్ల 50 శాతం మందికి పూర్తిగా సమస్య తగ్గుతుంది. దీంతో వారు తిరిగి వాళ్ల పని
వాళ్ళు చేసుకుంటారు. దీనికి అయ్యే ఖర్చు తక్కువే అని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం 4
నుంచి 7 శాతం మందిలో మాత్రమే జరుగుతుంది.
తీసుకొవలసిన జాగ్రతలు… (LIFE)
సాధారణంగా బీపీ 140/80 కన్నా తక్కుగా ఉండాలి. ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పకుండా బీపీని
130/80 లోపే ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యులతో బీపీ పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో
కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవాళ్లు తరచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులను సంప్రదించి
మందులను వాడాలి. ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి. అన్ని పోషక పదార్థాలు తీసుకోవాలి. కొవ్వు
అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. (LIFE)