220
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దాంతో ఏం కొనాలి? ఏం తినాలి అన్న ఆందోళన సామాన్యులను వేధిస్తోంది. రోజు రోజుకి తారాజువ్వలా పైపైకి పోతున్న పప్పుల ధరలు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. కందిపప్పు ధర రెండు నెలల్లోనే రూ. 170 నుంచి రూ.200 కు చేరడం పట్ల వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. మొదట్లో 120 140 రూపాయల మధ్యనున్న కందిపప్పు ధర చూస్తుండగానే మూడు నాలుగు నెలల వ్యవధిలోనే రూ.30 నుంచి 40 రూపాయలకు పెరిగి రూ.160 నుంచి రూ.170కి చేరుకుంది. ఇప్పుడది ఏకంగా మరో 40 రూపాయలు పెరిగి రూ.200 కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్నిషాపుల్లో నో స్టాక్ బోర్టులు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో సాధారణ ప్రజల కందిపప్పు కొనాలంటే గుడ్లు తేలేస్తున్నారు. శాఖాహారులకు బలాన్నిచ్చే ఈ పప్పు ధర పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయం లేక నానా అవస్థలూ పడుతున్నారు.
దిగుమతికి కేంద్రం నిర్ణయం 220
అయితే పెరుగుతున్న పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. పప్పుధాన్యాల నిల్వ పరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు 10 లక్షల టన్నుల కంది పప్పుని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దిగుమతి పప్పు నిల్వ స్టాక్ను పర్యవేక్షించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
గతేడాది నుంచి తగ్గిన ఉత్పత్తి
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కందిపప్పు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే దేశీయ ఉత్పత్తిలో 7.90 లక్షల టన్నుల తగ్గుదల నమోదైంది. 2022-23 అంచనా ప్రకారం దేశంలో కంది పప్పు ఉత్పత్తి 34.30 లక్షల టన్నులకు తగ్గింది. అయితే వాస్తవానికి ఈ ఏడాది కందిపప్పు ఉత్పత్తి లక్ష్యం 45.50 లక్షల టన్నులుగా నిర్ణయించారు. 2021-22 సంవత్సరంలో కంది పప్పు ఉత్పత్తి 42.20 లక్షల టన్నులుగా నమోదైంది. అటువంటి పరిస్థితిలో 2022-23 పంట సీజన్లో కందిపప్పు ఉత్పత్తిలో పెరుగుదలను ప్రభుత్వం అంచనా వేసింది. 220
పప్పు ధాన్యాల దిగుమతిలో మనమే నెంబర్ వన్ 220
పప్పుధాన్యాల విషయంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. భారతదేశంలో పప్పులకు ఉన్నడిమాండ్ మేరకు ఉత్పత్తి జరగడం లేదు. ఇతర దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల కోట్ల విలువైన పప్పులను దిగుమతి చేసుకుంటుంది. మన దేశం 2020-21 సంవత్సరంలో విదేశాల నుండి 24.66 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకుంది. అదే సమయంలో, 2021-22 సంవత్సరంలో 9.44 శాతం దిగుమతి సంఖ్య పెరుగుదల నమోదైంది. భారతదేశం 2021-22 సంవత్సరంలో ఇతర దేశాల నుండి 26.99 లక్షల టన్నుల పప్పులను కొనుగోలు చేసింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద పప్పుల దిగుమతిదారుగా భారత్ అవతరించింది. విశేషమేమిటంటే ఆఫ్రికా దేశాలు, మయన్మార్, కెనడా దేశాల నుంచి భారత్ అత్యధికంగా పప్పులను కొనుగోలు చేస్తుంది.
పెరుగుతున్న పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తిసుకుంటోంది. పప్పుధాన్యాల నిల్వ పరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు 10 లక్షల టన్నుల కంది పప్పుని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పప్పు నిల్వ స్టాక్ను పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నటు ప్రకటించింది.