(Murder)
చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని వేధించి, ఆపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేసిన ఘటన తాజగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది ఒకళ్లు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు యువకులు. అత్యంత కృరంగా కళ్ళు పీకేసి, జుట్టు కత్తిరించి ఆయువతిని చంపేయడం చిత్తూరులో కలకలం సృష్టించింది.
పాడుబడ్డ బావిలో మృతదేహం (Murder)
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, కావూరివారిపల్లె పంచాయతీ వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మల చివరి కుమార్తె భవ్యశ్రీ 16 పెనుమూరులోని ఓ ప్రావేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే భవ్యశ్రీకి గజేంద్ర, కుమార్ అనే ఇద్దరూ యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఎంజరిగిందో కానీ ఈ నెల 16వ తేదీ నుంచి భవ్యశ్రీ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి చుట్టుప్రక్కల ప్రాంతం అంతా వెతికారు. కానీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ నెల 19న వేణుగోపాలపురం సమీపంలోని ఓ పాత బావిలో యువతి మృతిదేహం ఉన్నట్లు వినాయకుడి నిమజ్జనం చేసేందుకు వెళ్ళిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి యువతి మృతిదేహాన్ని బయటకు తీయగా భవ్యశ్రీ అని గుర్తించారు. మొదట సాధారణ ఆత్మహత్యగా భావించిన పోలీసులు తరువాత హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ప్రేమ వేధింపులతో చనిపోయిందా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ కొనసాగించారు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలోనూ విద్యార్థిని మృతి కేసు దర్యాప్తు చేపట్టారు.
కళ్లు పీకేసి…జుట్టు కత్తిరించి… (Murder)
భవ్యశ్రీ మృతదేహం గుర్తు పట్టనంతగా మారిపోయింది. డెడ్ బాడీకి కళ్లు లేకపోవడం.తలపై వెంట్రుకలు లేకపోవడంతో దారుణంగా హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు.
భవ్యశ్రీ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్ కుమార్ చెబుతున్నారు. మృత దేహానికి తల వెంట్రుకలు లేకపోవడంతో జుట్టు పీకేసి చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవడంతో ఘటనా స్థలంలో దొరికిన జుట్టును తిరుపతిలోని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసులో నివేదిక ఉంటుందన్నారు. అయతే మూడు నాలుగు రోజులుగా మృతదేహం నీటిలో ఉన్న కారణంగా వెంట్రుకలు విడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలోనూ ఆమె తల్లిదండ్రుల ఫోన్ కాల్స్ రికార్డ్ ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ వివరించారు.ఈ కేసులో ముగ్గురు యువకులను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ట్రయాంగిల్ లవ్ ప్రాణం తీసిందా?
ప్రేమ వివాదం కారణంగానే భవ్యశ్రీ ప్రాణాలు కోల్పోయింది అని తెలుస్తోంది. అయితే అనుమానితులను పిలిపించి విచారించామని వారి ఫోన్లలో కాల్ డేటాను పరిశీలించామని అనుమానాస్పదంగా ఏమీ లేదని పోలిసులు వెల్లడించారు. అయితే ఆ హత్య ఎవరు చేసి ఉంటారన్న విషయం అర్ధం కావడం లేదు.. తిరుపతి ల్యాబ్ నుండి రిపోర్ట్ వస్తే భవ్యశ్రీ మృతిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని తల్లి తండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంక అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.