(IRR)
గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నింటినీ వెలికి తీస్తాం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన సీఎం జగన్ అన్నంత పనీ చేస్తున్నారిప్పుడు. అమరావతి రాజధాని నిర్మాణం పెద్ద స్కామ్ అని ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆమేరకు కేసులు కూడా నమోదవుతున్నాయి. సీఐడీ యమా స్పీడ్ గా నివేదికలు తయారు చేసేస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు అంశం ఇప్పుడు టీడీపీ మెడకు ఉచ్చులా మారింది. అప్పట్లో ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నా.. అదే ఇప్పుడు టీడీపీ పార్టీని అథ: పాతాళానికి నెట్టేస్తుందా అని అనిపిస్తోంది.
క్విడ్ ప్రోకో ఇలా జరిగిందా? (IRR)
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ అతిపెద్ద స్కామ్ అనీ అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బడా బాబులు పెద్ద ఎత్తున భూములు ముందే కొని ఆ తర్వాత ఆ భూములకు ఆనుకుని అలైన్ మెంట్ రోడ్ డిజైన్ చేశారన్నది సీఐడీ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ నారాయణ గ్రూపు విద్యాసంస్థలకు, లింగమనేని రియల్ ఎస్టేట్స్ కు , రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలకు భారీ ఎత్తున లబ్ది చేకూరేలా లావాదేవీలు జరిగాయన్నది సీఐడీ చేస్తున్న ఆరోపణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ దగ్గర ఈ సంస్థల అధిపతులు భారీగా భూములు కొన్నారు.
ఇక్కడ చంద్రబాబు కుటుంబం పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే వారి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ పేరు మీద కూడా భూములు ఉన్నాయి. అలైన్ మెంట్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములు కావడంతో వాటికి భారీ ఎత్తున ధరలు పలుకుతాయి.. ఇందుకు ప్రతిగానే క్విడ్ ప్రోకో కింద కరకట్ట దగ్గరున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చారన్నది సీఐడి అభియోగం. అమాయక రైతులనుంచి భూములు సేకరించడం ఒక తప్పయితే, వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తాము మాత్రం లబ్ది పొందేలా అలైన్మెంట్ రోడ్డును డిజైన్ చేయడం చంద్రబాబు చేసిన తప్పిదమని, ఈ కేసులో ఆయన ఏ 1 అని సీఐడి ఆరోపిస్తోంది.
బ్రహ్మిణి, భువనేశ్వరిలకూ కష్టాలు?
ఇదే కేసులో ఇప్పుడు లోకేష్ ఏ -14 నిందితునిగా ఉన్నారు. టెక్నికల్ గా చూసుకుంటే హెరిటేజ్ సంస్థలో లోకేష్ కేవలం డైరక్టర్ కాగా, బ్రహ్మణి, భువనేశ్వరి మాత్రం కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కూడా భారీగా లబ్దిపొందిందని సీఐడీ చెప్పడం వెనక భువనేశ్వరి, బ్రహ్మణిలు కూడా ఈ కేసు పరిధిలోకి వస్తారని చెప్పక చెప్పడమే..అంటే టోటల్ గా చంద్రబాబు ఫ్యామిలీకి అవినీతి మరక అంటుకున్నట్లే…
మరక మంచిది కాదుగా…
తాను నిప్పు అనీ..తప్పు చేయలేదని, చేయబోననీ, 40 ఏళ్ల ఇండస్ట్రీ అనీ పదే పదే చెప్పుకునే చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇదొక మరకగా మిగిలిపోతుంది. సీఐడి ఆరోపణలపై వీరు కోర్టుల చుట్టూ తిరిగి పోరాడొచ్చు గాక.. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చెప్పలేం.. కానీ పడాల్సిన మరక అయితే పడిపోయినట్లే.. అదేదో సర్ఫ్ యాడ్ లో మరక మంచిదే అనే ట్యాగ్ లైన్ వస్తుంటుంది. కానీ అన్ని మరకలూ మంచివి కావని మనం అనుకోవాలిప్పుడు. (IRR)
అసలే లోకే ష్ కు భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ పగ్గాలను, రాష్ట్ర పగ్గాలను గిఫ్ట్ గా ఇవ్వాలన్న తపనలో చంద్రబాబు 74 ఏళ్ల వయసులో కూడా అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. అలాటి టైములో ఈఎదురు దెబ్బ తగలడం పార్టీకి పెద్ద దెబ్బే. మరోవైపు తాను యువగళం పాద యాత్ర మళ్లీ అనౌన్స్ చేయగానే తనకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసును జగన్ గిఫ్ట్ గా ఇచ్చాడనీ, రిటర్న్ గిఫ్ట్ తప్పక ఇస్తాననీ లోకేష్ ప్రకటించాడు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అంత వీజీ కాదని పరిణామాలు చెబుతున్నాయి. తిప్పి కొట్టడానికి ముందు ఈ కేసుల లంపటం నుంచి బయటపడాలి కదా?