బీజి లైఫ్ లో వాటర్(Water) ని చాలా తక్కువగా తీసుకుంటున్నాము. మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఎక్కువగా నిరసానికి గురౌతున్నాం. మనం ఎక్కువ వాటర్ తాగకపోవడం వలే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం వున్న జనరేషన్ ప్రకారం మెుబైల్ ఫోన్ చూస్తు, ఆఫీస్ వర్క్ చేస్తు నీరు తాగడం కూడా మార్చిపోతున్నారు. మన శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన సమయంలో నీరు తాగడం చాలా ముఖ్యం. నీళ్లు తాగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి. మనం బతకడానికి గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే ముఖ్యం. ప్రతి రోజు సరైన మోతాదులో నీరు త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. సాధారణంగా మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. కాబట్టి శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే మనం ఎక్కువగా నీరు తాగడం చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు మూడు నాలుగు రోజులు తినకుండా బతికేయొచ్చు కానీ, నీరు లేకుండా ఒక రోజు కూడా కష్టమే. మనం ప్రతిరోజూ ఎంత నీరు తీసుకోవాలి అనే దాని గురించి నిపుణులు తరచుగా సమాచారం ఇస్తుంటారు. ప్రతిరోజూ రెండు,మూడు లీటర్ల నీరు మన శరీరంలో చేరాలి. నీరు తాగడం వల్ల మన శరీరంలో హైడ్రేట్ అవ్వడమే కాకుండా శరీరంలోని అన్ని బాక్టీరియా బయటకు పంపుతుంది. నీరు ఆరోగ్యానికి మంచిది కానీ, నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా, మీరు ప్రతిరోజూ ఒక లీటరు కంటే తక్కువ నీటిని తీసుకుంటే, అది కూడా ప్రమాదకరమే. తక్కువ నీరు తాగే వారు త్వరగా చనిపోతారని ఓ అధ్యయనంలో తేలిసింది.
డీ హి డ్రై షన్ తో సమస్యలెన్నో (Water)
నీటి కొరత కారణంగా, నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా వస్తుంది, తక్కువ నీరు తాగడం వల్ల నోరు ఎండిపోతుంది, ఫలితంగా నోటి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. కాబట్టి నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు త్రాగాలి. (Water)
మన రక్తానికి సోడియం ఎంత మేలు చేస్తుందో కూడా ఒక పరిశోధన నివేదిక చెబుతోంది. మన శరీరంలో లీటరు రక్తంలో 142 మిల్లీమోల్స్ సోడియం ఉండాలి. ఇది దాటితే అనారోగ్యం మొదలవుతుంది. రక్తంలో ఎక్కువ సోడియం గుండె వైఫల్యం, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధి, మధుమేహం, వంటి అనేక తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో డీహైడ్రేషన్ కీళ్ల నొప్పులు, కీడ్నిలో రాళ్లు వచ్చే సమస్యలు వస్తాయి.
తలనొప్పి వచ్చే ఛాన్స్
నీరు తక్కువగా తీసుకుంటే మనం తరచుగా తలనొప్పికి గురవుతూ ఉంటాం. ఎలాంటి కారణాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పి వస్తూ ఉంటే మనం నీళ్లు తాగడం లేదు అనే విషయాన్ని గుర్తించాలి. ఈ విధంగా వచ్చే తలనొప్పి మనం నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తగ్గుతుంది. ఇక మనం నీళ్లు తక్కువగా తీసుకుంటే మన చర్మం సాగినట్లుగా, డ్రైగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరం గట్టిగా, మాయిశ్చర్ తో కనిపిస్తుంది.
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీనిపై కొత్త రీసెర్చ్ చేసింది. తక్కువ నీరు తాగే వ్యక్తులు హైడ్రేటెడ్ గా ఉండే యువకుల కంటే పెద్దవారిగా కనిపిస్తారు. వీరికి అకాల మరణాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. దీంతో శరీరం డీహైడ్రేషన్కు గురైతే రోగాలు ఎక్కువగా వస్తాయని చేప్పున్నారు. మన శరీరంలో సోడియం స్థాయి పెరగడానికి తక్కువ నీరు తీసుకోవడం కారణం. ఒక వ్యక్తి తక్కువ నీటిని తీసుకుంటే వారి రక్తంలో ఎక్కువ సోడియం ఉంటుంది. రక్తంలో ఎక్కువ సోడియం ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా వేగంగా వృద్ధులు అవుతారు. అదే సమయంలో హైబీపీ, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలతో బాధపడటం ప్రారంభిస్తారు. అనేక వ్యాధులు కూడా వీరికి వస్తాయి అని పరిశోధకులు చెబుతున్నాయి.