సుబ్రహ్మేశ్వర స్వామి వాహనం నెమలి అని మనకందరికీ తెలుసు . కానీ సుబ్రమణ్య స్వామి చిత్ర పటం లో కోడి పొంజు కూడా ఒక మూల ఉంటుంది. మన దగ్గర కన్నా … తమిళనాడులో కార్తికేయుడి (Subramanya Swamy) గుడిలో కోళ్లను పెంచుతారు. కార్తికేయుడికి, కోడిపుంజుకు ఉన్న సంబంధం ఏమిటి? అని తెలియాలంటే ఆయన జన్మ వృత్తాంతం తెలుసుకోవలసిందే.
దక్షయజ్ఞంలో ఈశ్వరుని ధర్మపత్ని సతిదేవి మరణించిన తరువాత, శివుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఓ వైపు శివకు భార్య లేదు, మరోవైపు పెళ్లి చేసుకోలేదు. అలాంటి సమయంలో సంతానం కలగడం కుదరదని దేవతలంతా అనుకున్నారు. తారకాసురుడు, శూరపద్ముడు అనే ఇద్దరు రాక్షసులకు ఈ సందర్భాన్ని అదును గా అనుకున్నారు ఎందుకంటే వారికి శివుని కుమారుడి చేతిలో తప్ప, మరెవ్వరి చేతిలో తాము చనిపోలేమని వరం పొందారు కాబ్బటి.
ఆ రాక్షసుల ఆగడాలకు అంతులేదు. అదే సమయంలో వారు స్వర్గ లోకం పై దాడి చేసి ఇంద్రుడిని కూడా ఓడించారు. అటువంటి పరిస్థితిలో, అయోమయం లో పడ్డ దేవతలు మన్మథుడిని శివుని యొక్క వైరాగ్యాన్ని విచ్ఛిన్నం చేయమని కోరారు. అయితే, మన్మథుడు అలా ప్రయత్నించినప్పుడు, అతను ఈశ్వరుని కోపానికి గురై భస్మమైపోయాడని పురాణం. ఆ సమయంలో పరమశివుడి నుంచి వెలువడిన కిరణాలు కార్తికేయుడిగా (Subramanya Swamy) రూపాంతరం చెందాయి.
అగ్నిదేవుడు కూడా శివుని కిరణాలను తట్టుకోలేకపోయాడట. ఆయన గంగలో వదిలేశాడు. కాబట్టి గంగానది రెల్లు పొదలు లో జన్మించిన కార్తికేయను ఆరుగురు సోదరీమణులు (కార్తీకులు) పెంచారు. కొన్ని సంవత్సరాల తరువాత, కార్తికేయ (Subramanya Swamy) తన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. కార్తికేయుడు తాను జన్మించిన కారణాన్నితెలుసుకుని తారకాసురుడి తో యుద్ధానికి దిగాడు.
ఏకాదశ రుద్రుడు కార్తికేయుడుకి యుద్ధం లో తోడుగా వెళ్లగా తన తల్లి పార్వతి దేవి ఇచ్చిన వేలాయుధం అనే ఖడ్గాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. తమిళనాడులోని తిరుచెందూర్ జిల్లాలో కార్తికేయ (Subramanya Swamy) మరియు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. తిరుచెందూర్ లో ని సముద్ర తీరాన శూరపద్ముడు, తారకాసురుడు కలిసి కార్తికేయుడితో యుద్ధం చేసేందుకు సాహసించారు.
కార్తికేయుడు (Subramanya Swamy) మరెవరో కాదు సాక్షాత్తు ఆ శివుని కుమారుడని శూరపద్ముడుకి తెలిసింది. కానీ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. పైగా దేవతలను కూడా ఎదిరించడం రాక్షస ధోరణి తో కార్తికేయ పై యుద్ధానికి దిగాడు. కానీ తన సైనికులు మరియు సహచరులు యుద్ధంలో ఒంటరిగా చనిపోవడం చూసి శూరపద్ముడు భయపడ్డాడట.
శూరపద్ముడు మామిడి చెట్టు వేషం వేసుకుని కార్తికేయుడికి కనిపించకుండా దాక్కోవడానికి ప్రయత్నించాడట. కానీ షణ్ముఖి కన్ను నుండి తప్పించుకోవడం సాధ్యం అయ్యే విషయమా.. ! కార్తికేయుడు తన వేలాయుధం తో మామిడి చెట్టును రెండు ముక్కలుగా చీల్చాడట. ఆలా ఆ మామిడి చెట్టు రెండు భాగాలు గా అయ్యి ఒక భాగం నెమలిగానూ, రెండవ భాగం కోడి పుంజు గానూ మారిపోయిందట. కార్తికేయుడు (Subramanya Swamy) నెమలిని తన వాహనంగా, కోడిపుంజును ధ్వజంగా మార్చుకున్నాడు. అలా కోడిపుంజు సుబ్రమణ్య స్వామి పక్కన చేరిందట.