ఈ మధ్య కాలంలో కరెంట్ షాక్త (shock) గిలి చనిపోతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యమో లేదా ఇతర కారణాలవల్లో కానీ అభం శుభం తెలియని చిన్నారులు కానరాని లోకాలకు మరలుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చాక్లెట్ అడిగిన చిన్నారి తండ్రి వెంటే వెళ్లి ఫ్రిజ్ డోర్ తీయబోయింది. అంతలోనే షాక్ తగిలి బిగిసిపోయింది. ఆ తర్వాత విషయం గ్రహించిన తండ్రి ఆచిన్నారిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నందిపేట్ మండల కేంద్రానికి చెందిన రాజశేఖర్ సంయుక్తలకు ఇద్దరు పిల్లలు. వారికి రిషిత రెండో సంతానం. నందిపేటలోని వారి బంధువుల ఇంటికి పూజా కార్యక్రమానికి వెళ్లారు. వీరు పూజకు సామాగ్రి కోసం దగ్గర్లో ఉన్న ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లారు. తనతోపాటు పూజను కూడా సరదాగా తీసుకెళ్లాడా తండ్రి. కానీఅదే చివరకు శాపంగా మారింది.
పాపని గమనించని తండ్రి …
సుమారు 7:30 సమయంలో వీళ్లు షాపుకు వెళ్లినటు తెలుస్తుంది. కావాల్సిన సామాగ్రి అంతా తీసుకున్నారు. ఏదైనా తాగడానికి తీసుకుందాం అని ఫ్రిజ్ దగ్గరకు వెళ్లాడు తండ్రి.. తన వెనుక వచ్చిన పాపను గమనించలేదు. చాక్లెట్ తీసుకుంటానంటూ ఆ పాప పక్కనే ఉన్న మరో ఫ్రిజ్ డోర్ పట్టుకోగానే షాక్ తగిలింది. ఆ ఫ్రిజ్ తలుపుకే వేళ్లాడిపోయింది. కొద్ది సేపటికి గమనించిన తండ్రి గుండెలు బాదుకుంటూ ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించాడు. అయినా ప్రయోజనం లెకుండా పోయింది. సుమారు నాలుగు ఆసుపత్రులకు తీసుకెళ్లినా అన్ని చోట్లా పాపకు పల్స్ లేదు అన్నారు వైద్యులు. చివరకు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే చనిపోయింది అన్ని డాక్టర్స్ చెప్పారు.
గాంధీ జయంతి అని బోర్డ్ తిప్పేసారు…
అయితే చిన్నారి చనిపోయిన విషయం తెలుసుకున్న సూపర్ మార్కెట్ సిబ్బంది గాంధీ జయంతి అని బోర్డ్ పెట్టి షాప్ మూసేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే పాప ప్రాణం పోవటానికి కారణం సూపర్ మార్కెట్ యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ ఆరోపించారు గ్రామస్థులు. పాపకు న్యాయం జరిగేవరకు అక్కడే సూమారు నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. వీరికి అక్కడ ఉన్న స్ధానికులు మద్దతు తెలపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదిలేదంటూ తీవ్రంగా గొడవ చేసి అక్కడే రోడ్డుపై కూర్చున్నారు.
కరెంట్ షాక్(shock) కారణంగానే చనిపోయింది…
కరెంట్ షాక్ కారణంగానే తమ పాప చనిపోయింది అని కోపంతో రిషిత తల్లిదండ్రులు బంధువులతోకలసి సూపర్ మార్కెట్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం జరిగే వరకూ చిన్నారి మృత దేహాన్ని తీసుకెళ్లబోమని బైఠాయించారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వీరి ధర్నాతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలిసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.