sikkim
ఒక్క రాత్రిలో కురిసిన కుంభవృష్టి సిక్కింని అతలాకుతలం చేసేసింది. దీనివల్ల వరదలు ముంచెత్తి ఏకంగా 28 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయారు. సాధారణంగా ప్రకృతి విలయాలు తలెత్తినప్పుడు జనం భద్రత, తరలింపు, సేఫ్టీ కోసం పారామిలటరీ, ఆర్మీ బలగాలను వినియోగిస్తాం. అలాంటి ఆ సిబ్బందే వరదల్లో కొట్టుకుపోయారంటే అక్కడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. సిక్కింలో ఈఘటన అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది. వరద ప్రమాద దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుంభవృష్టి వల్ల వరదలు ముంచెత్తి తీస్తా నది పొంగి పొర్లింది. దాంతో లాచెన్ వ్యాలీ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ గుడారాలన్నీ కొట్టుకుపోయాయి. చంగ్ థంగ్ డ్యామ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో నది ప్రవాహం లెవెల్ ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల ఎత్తుకు చేరుకుంది. దాంతో 23 మంది సైనికులు ఈ వరదల్లో కొట్టుకుపోయారు. జాడ తెలియకుండా పోయిన వారందరినీ ట్రేస్ అవుట్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ వరదలకు కొన్ని వాహనాలు సైతం బరద బురదలో కూరుకుపోయాయి.
లోనాక్ లేక్ లో కుంభవృష్టి వల్లనే… sikkim
సిక్కింలో ఓ నెల్లాళ్ల పాటు కురవాల్సిన వాన అంతా ఒక్క రాత్రిలో కురిసేసింది. ఉత్తర సిక్కింలో లోనాక్ లేక్ లో ఏర్పడిన కుంభవృష్టే ఈ సమస్యలన్నింటికీ కారణమైంది. ఈ కుంభవృష్టి వల్ల పెద్ద ఎత్తున వర్షపు నీరు తీస్తా నదిలోకి మళ్లింది. తీస్తా నది బంగ్లాదేశ్ లోకి అడుగు పెట్టే ముందు మన దేశంలో సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
హై అలెర్ట్ ప్రకటించిన సిక్కిం ప్రభుత్వం
తాజా పరిస్థితుల నేపధ్యంలో సిక్కిం ప్రభుత్వ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉథృతంగా ప్రవహిస్తున్న తీస్తా నది, రోడ్లపై మనిషి ఎత్తున ప్రవహిస్తున్న వరద బురదల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈవరదల్లో ఎవరూ గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం జరగలేదు కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. సింగ్టం ఏరియాలో కొందరు వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ఉధృతికి ఇళ్లలోనే ఉండిపోయిన వారందరికీ నిత్యావసరాలు అందచేసేందుకు సిక్కిం ప్రభుత్వం యంత్రాంగం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు.
కూలిన బ్రిడ్జిలు.. కొట్టుకుపోయిన పక్కా ఇళ్లు…
వరదల వల్ల టూంగ్ బ్రిడ్జ్ కూలిపోవడంతో మంగన్ జిల్లాలోనిఛాంగ్ థంగ్ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు అదే ఏరియాలో ఉన్న ఫిడాంగ్ బ్రిడ్జ్ కూడా కుప్పకూలింది.నాలుగు పక్కా ఇళ్లకు నష్టం వాటిల్లింది. డిక్చు ఏరియాలో రెండు ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తీస్తా నదికి ఒడ్డున ఉన్న ప్రాంతాలలో ఉన్న ఇళ్లన్నీ వరదలకు కొట్టుకుపోయాయి. సంఖలాంగ్ లోని GREF ప్లాంట్ కూడా వరదలకు ధ్వంసమైంది. ఇందులో పనిచేసే కార్మికులు కనిపించకుండా పోయారు.గ్యాంగ్ టక్ లో వరదలకు కొట్టుకుపోతున్న 25 మందిని SDRF సిబ్బంది కాపాడారు. ఎల్డి కాజీ బ్రిడ్జి, ఇంద్రేణి బ్రిడ్జి కూడా వరదకు కొట్టుకుపోయాయి. వరదల వల్ల నిరాశ్రయులయిన వారికోసం పర్నమీ మందిర్ లోనూ, నాంఫింగ్ లోని సాయి మందిర్ లోనూ షెల్టర్ హోమ్స్ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందిని ఈ రిలీఫ్ క్యాంపులలో ఉంచి నిత్యావసరాలు అందిస్తున్నారు. కుంభవృష్టి కారణంగా సక్కింగ్ చంగ్థాంగ్ సరస్సు వర్షపు నీటితో నిండి ఓవర్ ఫ్లో అయిపోయింది. దాని వల్ల తీస్తా నదికి ఉథృతి పెరిగింది. ఈ కారణంగా గాజోల్దోబా, దోమోహని, మెఖాలీగంజ్, ఘిష్ తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ కుంభవృష్టి ప్రభావం మరింత ఉండొచ్చని కాబట్టి స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవ్వరూ బయటకు రావొద్దని సిక్కిం ప్రభుత్వం ప్రకటించింది.
sikkim చరిత్రలోనే పెద్ద కుంభవృష్టి
సిక్కిం చరిత్రలోనే ఇంత భయంకరమైన కుంభవృష్టి , వరదలను చూడలేదని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ కామెంట్ చేశారు. తీస్తా నది పొంగడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అందరూ సురక్షిత ప్రాంతాలలో తలదాల్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. తీస్తానది డేంజర్ లెవెల్ దాటి మూడు అడుగుల ఎత్తున ప్రవహిస్తోందని జిల్లా అధికారులు తెలిపారు.