(RAPO)
సిని ఇండస్ట్రీ లో ప్రేమ వివాహాలు సర్వ సాధారణం.సినీ తారలు ప్రేమించు కోవటం పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ లో ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు సంతోషంగా ఉన్నారు.. కొందరు విడిపోయారు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టార్ల మధ్య పుకార్లు, షికార్లు చాలా చాలా కామన్.. ఇప్పుడు తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడనే న్యూస్ గుప్పుమంటోంది. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ లో మునిగి తేలుతున్నారుట.
త్వరలోనే మూడు ముళ్లు పడటం ఖాయం అంటూ నెట్టింట వార్తలు ట్రెండ్అవుతున్నాయి. వీరి లవ్ గాసిప్స్ ప్రస్తుతం బీ టౌన్ లో ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. ఇంతకీ రామ్ ఎవరిని ప్రేమించాడు? ఆ అందాల సుందరి ఎవరు? ఇదేగా మీ డౌట్.. సాధారణంగా కుర్ర హీరోలు, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదిరితే దానికి మన ఫ్యాన్స్ చెలరేగి పోయి ఇంకేముంది ప్రేమలో ఉన్నారు.. పెళ్ళి ఖాయం అంటూ పుకార్లు లేపుతారు. రామ్ విషయంలో కూడా అదే జరిగింది. రామ్ కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ను ప్రేమిస్తున్నాడు.. ఇద్దరూ ఇరు కుటుంబాల ఆశీస్సులతో తొందరలోనే ఒక్క టవబోతున్నారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇంకేముంది రామ్ బ్యాచిలర్స్ లైఫ్ కి చెక్ పెడుతున్నాడు.. తొందరలోనే భారీగా బాచిలర్స్ పార్టీ కూడా ఇచ్చేస్తాడంటూ మరికొందరు ఫ్యాన్స్ మసాలా దట్టించారు.
ఇద్దరికీ కుదిరిందెక్కడ?
రామ్ (RAPO), అనుపమ పరమేశ్వరన్ జంట ఉన్నది ఒక్కటే జిందగి, హలో గురూ ప్రేమ కోసమే సినిమాల్లో కలిసి నటించారు. ఆ సినిమాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ అదరహో అనిపించింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా ఇండస్ట్రీలో మూవ్ అవుతున్నారు. ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లి ప్రకటన వస్తుందని గాసిప్స్ వినిపించాయి. అయితే దీనిపై ఆ జంట మాత్రం పెదవి విప్పడం లేదు. రూమర్లని ఎంజాయ్ చేస్తున్నారేమో తెలీదు కానీ.. అసలీ వార్తలపై ఇద్దర్లో ఎవరూ స్పందించలేదు.
క్లారిటీ ఇచ్చిన అనుపమ తల్లి:
రామ్, అనుపమ పెళ్లి అంటూ వస్తున్న పుకార్లపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అనుపమ తల్లి సునీత. ఇవన్నీ తప్పుడు వార్తలు. వాళ్లిద్దరూ కలిసి నటించారు అంతే.. దానికే ఇన్ని పుకార్లు పుట్టిస్తారా? ఇలాంటి పనికి మాలిన పనులు మానుకోండి. పనీ పాటూ లేదా అంటూ తిట్టి పోశారు.వాళ్లిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్.. అనవసర ప్రచారాలు కట్టి పెట్టండి అంటూ ఫైర్ అయ్యారు సునీత. సో అనుపమా పరమేశ్వరన్ తల్లి మాటలతో ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.
సిద్ధమవుతున్న సీక్వెల్ మూవీ (RAPO)
ప్రస్తుతానికి రామ్ లేటెస్ట్ మూవీ స్కంద ధియేటర్లలో మోత మోగిస్తోంది. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరే సినిమా రామ్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదన్నది నిజం. అయితే ఇప్పుడదే సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ త్వరలోనే తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ మూవీని పూరీ జగన్నాథ్ డైరక్ట్ చేస్తుండగా ఓ ఇంపార్టెంట్ రోల్ లో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు.