ఏపీలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఆ పరిణామాలెలా ఉన్నా.. తన గెలుపు కోసం బాటలువేసుకుంటున్న వైసీపీ YCP తమ ఫ్లాగ్ షిప్ పథకాలపై మరింత శ్రద్ధపెట్టడమేకాక అవే తమ గెలుపుకు సోపానాలని నమ్ముతోంది. విద్య, వైద్యం ఈ రెండు రంగాలపైనే ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి పెట్టింది. సమగ్ర సమాజ నిర్మాణానికి కీలక రంగాలైన ఈరెంటిని ప్రక్షాళనచేసి పరుగులుపెట్టిస్తే తప్ప ప్రగతి సాధ్యం కాదని నమ్ముతున్న జగన్ విద్యా రంగలో ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చారు. సామాజిక అంతరాలు తొలగించడానికి వీలుగా, పేద పిల్లలూ బాగా చదువుకోవాలన్న తపనతో వాళ్ల కు పుస్తకాలు, స్కూలు బ్యాగు, షూస్, యూనీఫామ్ సహా అన్నీ నాణ్యమైన సరుకును ఉచితంగా అందించారు. ఇంగ్లీష్ మీడియం చదువులతో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు.
విద్యారంగంలో వినూత్న సంస్కరణలు YCP
వారిలో పోటీ తత్వాన్ని పెంచేందుకు ఇప్పుడు సెల్ఫీ విత్ టాపర్స్ అనే కొత్త కాన్సెప్ట్ ను తీసుకొస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పాస్ పర్సంటేజ్ పెంచడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీనివల్ల ఫార్మేటివ్ అసస్మెంట్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారు మరింత ఉత్సాహంతో చదివే వీలుంటుంది. ఫార్మేటివ్ అసెస్ మెంట్-2 పరీక్షా ఫలితాల్లో తరగతి వారీగా టాపర్లుగా నిలిచిన విద్యార్ధులతో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీనివల్ల పిల్లల్లో మరింత చదవాలన్న పట్టుదల పెరుగుతుంది. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈప్రోగ్రాంలో పాల్గొనాలన్న ఆదేశాలు ఇప్పటికే అందాయి.
ఇంటర్ సర్టిఫికెట్లకు డిజీ లాకర్ సౌకర్యం
ఈ ఏడాది ఇంటర్ పాస్ అయిన విద్యార్ధులు తమ సర్టిఫికెట్లు తీసుకోవడంలో తీవ్రజాప్యం ఏర్పడటంతో ఏపీ ప్రభుత్వం విమర్శల పాలయ్యింది. దాంతో ఈ సమస్యకు పరిష్కారంగా సాంకేతిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇంటర్ పాస్ అయిన వారంతా ఇకనుంచి సర్టిఫికెట్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్ పాస్ సర్టిఫికెట్ తోపాటు, మైగ్రేషన్ సర్టిఫికెట్, తదితర సర్టిఫికెట్లను డిజీలాకర్ లో అందుబాటులో ఉంచింది. ఈ విధానం వల్ల 2014 నుంచి 2023 ఏడాది మధ్య చదువుకున్న వారందరి అన్ని సర్టిఫికెట్లు డిజీ లాకర్ లో ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
విద్యార్ధులు వారి వారి అవసరాలమేరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.ఇప్పటికే ఏపీలో పలు కార్డుల స్థానంలో డిజీలాకర్ లో డిజిటల్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.. తాజాగా ఇంటర్ సర్టిఫికెట్లను కూడా డిజీలాకర్ లో అందుబాటులోకి తెచ్చింది.అలాగే బడికి వెళ్లే విద్యార్ధుల సంఖ్యను పెంచడానికి వీలుగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచడం ద్వారా ఎక్కువమంది విద్యార్ధులకు నాణ్యమైన చదువును అందించడమే లక్ష్యంగా అడుగులేస్తోంది.
ఫెయిల్యూర్ స్టూడెంట్స్ లో ఆత్మ విశ్వాసం YCP
వాస్తవానికి ఇంటర్ రెండేళ్లు పూర్తి చేసుకున్న వారు ఏవైనా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఆయా సబ్జెక్టులను తిరిగి సప్లిమెంటరీ రాసి పాస్ అవుతారు. అయితే వారి సర్టిఫికెట్లపై సప్లిమెంటరీ, లేదా జూన్- జులై పాస్ అని ఉంటుంది. కానీ ఫెయిల్ అయిన విద్యార్ధులు నిరాశ పడకుండా మళ్లీ కాలేజీలో అడ్మిట్ అయి మొదట్నుంచి చదువుకునే వీలు కల్పిస్తోంది. వీరు అన్ని పరీక్షలు మరోసారి రాసే అవకాశం కల్పిస్తారు. అలాగే పాత పరీక్షలు, కొత్త పరీక్షలు వీటిలో ఎందులో ఎక్కువ వస్తే ఆ ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకుని ఫైనల్ మార్క్స్ లిస్ట్ లో వేస్తారు. పైగా ఈ సప్లిమెంటరీ విద్యార్ధులకు కూడారెగ్యులర్ విద్యార్ధులలాగే జగనన్న అమ్మవొడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద పథకాలు వర్తిస్తాయి.
ఈ తాజా నిర్ణయం ఫెయిల్యూర్ స్టూడెంట్లలో నిరాశను దూరం చేసి మరింత జాగ్రత్తగా చదివి పాస్ అవ్వాలన్న తపన పెంచుతుందని, అలాగే ఓవరాల్ పాస్ పర్సంటేజ్ పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం నమ్ముతోంది.జగనన్న విద్యాదీవెన, జగనన్న గోరు ముద్ద, జగనన్న అమ్మఒడి పథకాలు పూర్తిగా రేపటి తరం భవిష్యత్తును కాపాడేవే. కరోనా టైమ్ లోనూ విద్యా రంగం కుదేలవకుడా చర్యలు తీసుకున్న ప్రభుత్వం టెంత్ పరీక్షలను కూడా కఠినంగా నిర్వహించి మెరిట్ ఆధారంగా, కష్టపడినవారే పాస్ అయ్యేలా నిబంధనలు కఠినంగా అమలు చేసింది. ఈ విషయంలో ఫెయిల్ అయిన పిల్లలు, వారి తల్లి దండ్రుల నుంచి ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. పిల్లలకు స్కూలు లో చదువు అబ్బాలంటే ముందు స్కూలు వాతావరణం బాగుండాలని అనేక ప్రాధమిక పాఠశాలల రూపు, షేపు సమూలంగా మార్చేశారు.