తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి వద్ద ఒక మహిళ హల్ చల్ చేసింది. అక్కడకు వచ్చి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీసులు మహిళ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుని ఆమెను తాడేపల్లి పోలీసు స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. తన పేరుపై ఉన్న ఆస్తిని సొంత బంధువులు ఆన్ లైన్ లో పేరు మార్చి రెండు ఎకరాలను కోటిన్నరకు విక్రయించారని, ఎన్ని మార్లు స్పందనలో తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళ ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా…
తన ఆస్తులు బంధువులు అమ్మడంతో తన పిల్లలు అనాధలుగా మారతారని, ముఖ్యమంత్రిని కలిసేందుకు తాను వచ్చానని, అయితే అనుమతించకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుందామని భావించానని మహిళ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది? పేరు, ఊరు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మహిళను విచారించి ఆమె సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని నచ్చ చెబుతున్నారు.