ఆప్ఘన్ VS ఇండియా
వన్డే ప్రపంచకప్ లో తొలి మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ నేడు మరో పోరుకు సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఓ దశలో క్లిష్ట పరిస్థితులు సృష్టించుకుంది. టాప్ ఆర్డర్లోని ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కావడంతో మిగతా బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడింది. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ల పోరాటంతో విజయం సాధించింది.
జట్టును గెలిపించిన కోహ్లీ రాహుల్ …… VS
ఆస్ట్రేలియాపై బాగా అడి జట్టును గెలిపించిన రాహుల్, కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు కూడా బాగా రాణిస్తారు అని ఆశిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భారత్ స్పిన్నర్ల మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఢీల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి జడేజా, కుల్దీప్ లపై మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది. పిచ్ ను బట్టి మూడో స్పిన్నర్ గా ఆర్ అశ్విన్ ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే బుమ్రా, సిరాజ్ లకు తోడుగా మెుహ్మద్ షమీ బరిలోకి దిగుతాడు.
కోహ్లీ VS నవీన్ ఉల్ హక్……
ఇండియా వర్సెస్ ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది కోహ్లీ
నవీన్ ఉల్ హక్. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. అప్పటి నుంచి ఆఫ్గాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ ఫ్యాన్స్ విపరితంగా ఓ ఆటాడుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ సమయంలో నవీన్ ఉల్ హుక్ బౌలింగ్ వేస్తే వారిద్దరి మద్య ఏ విధంగా ఉంటుంది అన్ని ఆసక్తికరంగా మారింది.
స్పిన్ కు అనుకులం…..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ పిచ్ సాధారణంగా నెమ్మదిగా, స్పిన్ బౌలర్లకు సహాయకరంగా పరిగణిస్తుంటారు. కానీ, చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 428 పరుగులు చేసింది.
అయితే, సాయంత్రం మంచు కురుస్తుంది అలాగే కొంచెం చలి కూడా ఉంటుంది. దీనిలో ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. తరువాత బ్యాట్స్మెన్లకు బ్యాటింగ్ చేయడం సులభం మారుతుంది.
బ్యాటర్లు ఫామ్ లోకి రావటానికి మంచి అవకాశం…..
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాంత్ కిషన్ డకౌట్ అయ్యారు. వీరితోపాటు సెకండ్ డౌన్ బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ కూడా డకౌట్ అయ్యాడు. కోహ్లీ, రాహుల్ క్రీజులో నిలవకపోయిఉంటే ఆసీస్ చేతిలో టీమిండియా ఘోరంగా ఒడిపోయి ఉండేది. అయితే ఈనెల 14న పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టుకు ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఆ రికార్డును భారత్ జట్టు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు ఆఫ్గానిస్థాన్ తో మ్యాచ్ జరుగుతుండటం భారత్ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశమే. ఎందుకంటే.. ఈ మ్యాచ్ ద్వారా గత మ్యాచ్ లో విఫలమైన బ్యాటర్లు ఫామ్ లోకి రావటానికి మంచి అవకాశం. ఈ మ్యాచ్ లో రోహిత్, ఇషాన్ కిషన్ లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడితే భారత్ జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.
డెంగ్యూతో తొలి రెండు మ్యాచ్లకు దూరం….
డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వరల్డ్ కప్లో తొలి రెండు మ్యాచ్లకు దూరమైన శుభ్మన్ గిల్ ప్లేట్లెట్లు పడిపోవడంతో చెన్నైలోని హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. భారత జట్టు ఆసీస్తో వన్డే అనంతరం అప్ఘాన్తో మ్యాచ్ కోసం ఢిల్లీ బయల్దేరి వెళ్లగా గిల్ మాత్రం చెన్నైలోనే ఉండిపోయాడు. ఆరోగ్యం కాస్త మెరుగు పడటంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన గిల్ హోటల్ రూమ్లోనే చికిత్స పొందాడు. గిల్ ఆరోగ్యం కాస్త మెరుగవడంతో నేడు అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లనున్నాడు. గిల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు అహ్మదాబాద్లోనే బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకోనున్నాడు.