అమరావతి :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘నంది నాటకోత్సవాలు’ ఈ ఏడాది నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ అమరావతి కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి మంగళవారం నాడు మీడియా కు తెలిపారు . ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులకు గుర్తింపు, అవార్డులు అందుతాయన్నారు .
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో డైరెక్టర్ పోసాని, ఎఫ్డిసి మేనేజింగ్ విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998 నుంచి 2004 మధ్య కాలంలో నంది అవార్డుల వేడుకలు జరిగాయి, థియేటర్ ఫెస్టివల్ హైదరాబాద్కే పరిమితమైందని , .
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నంది నాటకోత్సవాలు’ నిర్వహిస్తున్నామని హామీ ఇచ్చి రద్దు చేశారన్నారు . అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఈ ఏడాది నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ఇక పోసాని మాట్లాడుతూ సినిమా, టీవీ, రంగస్థల అవార్డులన్నీ కలిపి ఒకేసారి ఇవ్వడం కష్టం కాబట్టి ముందుగా పద్య నాటకాలు అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు . అనంతరం ఇతర విభాగాల్లో ని అర్హులకు అవార్డులు అందజేస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుందని, నోటిఫికేషన్ తేదీ నుండి దరఖాస్తులను సమర్పించడానికి 30 రోజుల గడువు ఉంటుందని విజయ కుమార్ రెడ్డి తెలిపారు. మొదట పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక ఆటలు, చిల్డ్రన్ ప్లేలెట్స్, యూత్ ప్లేలెట్స్అనే ఈ ఐదు విభాగాల్లో అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు . ఈ విభాగాల్లో మొత్తం 73 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆయన మీడియా కు తెలిపారు.
నంది అవార్డుల గురించి
సీఎం జగన్ నాకు చెప్పిన మాట ఇదే– పోసాని కృష్ణ మురళి, వైఎస్ఆర్ సీపీ నేత#NandiAwards pic.twitter.com/xqiotnXvGs
— Political Sniper (@PolisStrategist) July 4, 2023
Follow Us On : YouTube , Google News