Andhra Pradesh: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొదటి సారిగా ఇక పై రాష్ట్రంలోని రోడ్ల పై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ (Ear Phones) లేదా హెడ్ ఫోన్స్ (Head Phones) పెట్టుకుని డ్రైవింగ్ చేశారంటే రూ. 20,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ఈ జరిమానాకు సంబందించిన విధి విధానాలను త్వరలోనే రవాణా శాఖకు ప్రభుత్వం జారీ చేస్తుందని, ఆగెస్ట్ (Augest) నెల నుంచే ఈ జరిమానా అమలు అవుతుందని సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన వాహనదారుల నుంచి మిశ్ర స్పందన వస్తూ వుంది.