ఆంధ్రప్రదేశ్ (Ap) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పై ఆర్డినెన్స్ వస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీ ఎన్జీవోస్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. సీపీఎస్ పరిష్కారానికి తాను కృషి చేస్తానని పాదయాత్ర చేసిన సమయంలో హామీ ఇచ్చానని, ఆ మేరకు తాను హామీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. సీపీఎస్ శాశ్వత పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా త్వరలో విడుదల వుతుందని తెలిపారు.
జీపీఎస్ పై ఆర్డినెన్స్…
తాము సీపీఎస్ కు ధీటుగానే జీపీఎస్ ను రూపొందించామని తెలిపారు. ప్రభుత్వానికి భారం లేకుండా రూపొందించిన ఈ జీపీఎస్ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఉద్యోగులు నష్టపోకుండా ఉండేలా అన్నిచర్యలు తీసుకున్నామన్న జగన్ ఈ విధానం దేశమంతా కాపీ కొడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు జీపీఎస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన తమ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్రీ సర్కార్ అని ఆయన తెలిపారు. ఉద్యోగుల అవసరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పరిపాలనలోనూ అనేక మార్పులు తెచ్చి ఉద్యోగులపై వత్తిడి తగ్గించామన్న జగన్, ప్రభుత్వం, ఉద్యోగులు కలసి పని చేస్తేనే ప్రజలకు సక్రమంగా పౌరసేవలు లభిస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే పాలన నడుస్తుందన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా ఉద్యోగుల వల్లేనని జగన్ అభిప్రాయపడ్డారు. తాము ఉద్యోగులందరూ మంచిగా ఉండేలా, వారి సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వరాల జల్లు… (Ap)
ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు ప్రకటించారు. పెండింగ్ లో ఉన్న డీఏను దసరాకు కానుకగా ఇస్తామని తెలిపారు. ఒక డీఏను దసరా గిఫ్ట్ గా అందిస్తామని జగన్ ఉద్యోగుల సభలో హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తుందని తెలిపారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమన్న జగన్ అందరం కలసి పనిచేయగలిగితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఉద్యోగులపై పనిభారం పడకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
ఆనందంగా ఉండేలా…
ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆనందంగా ఉండాలని తాము యోచిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై మూడు వేల మందిని ఒక్క హెల్త్ విభాగంలోనే నియమించామని గుర్తు చేశారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వంపై వచ్చే ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. తాను గత ప్రభుత్వంలాగా ఎంప్లాయీస్ ను మోసం చేసేవాడిని కాదని, ఉద్యోగుల పట్ల గత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి అభిప్రాయం ఉందో మీకు చెప్పాల్సిన పని లేదని జగన్ అన్నారు. కొందరికే పెద్దపీట వేసి మరికొందరిని పక్కన పెట్టే మనస్తత్వం తనది కాదన్న జగన్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, దీనిని అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఎవరికి ఎలాంటి అపోహలున్నా మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. (Ap)