ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం రేపటికి పదమూడు వందల రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నేటి నుంచి రైతులు ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు. ఈరోజు రాజధాని ప్రాంతంలో వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ సందర్శన యాత్రలో తర్వాత ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు.
ఆలయాల సందర్శన…
అలాగే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని కూడా సందర్శించుకోనున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడంతో గత 1300 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. పాదయాత్రలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరారు. రేపు పెద్దయెత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
Follow Us On : YouTube , Google News