ఆంధ్రప్రదేశ్ ఆర్ఘిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వియత్నాం పర్యటనలో ఉన్నరు. ఆయన వియత్నాం డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమయ్యారు. పారిశ్రామికాభివృద్ధి కోసం బుగ్గన వియత్నాంలో పర్యటిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వీలుగా సహకారం అందించేందుకు వియత్నాం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.
పెట్టుబడుల కోసం…
అంతకు ముందు హనోయిలోని ఇండియా హౌస్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ గార్కో టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్సిటీని సందర్శించారు. హనోయ్ లో భారత్ రాయబారి ను సందీప్ ఆర్యాను కలిసి పెట్టుబడులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ లు ఉన్నారు.