అంచనాలను నిజం చేస్తూ ఆసియా Asia గేమ్స్ లో 2023లో టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణకాంతులు విరజిమ్మింది. అఫ్గానిస్థాన్తో జరిగిన క్రికెట్ ఫైనల్ వర్షం వల్ల రద్దవ్వడంతో టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్ కంటే ర్యాంకింగ్లో ముందున్న భారత్ పసిడి పతకాన్ని గెలుచుకుంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ అఫ్గాన్ కు బ్యాటింగ్ ఇచ్చింది. టీమిండియా బౌలర్లు అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు.
వర్షం కారణంగా రద్దు
గ్రౌండ్ ను పూర్తిగా కప్పకపోవడంతో వర్షం వల్ల అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. దాంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఇక అఫ్గానిస్తాన్ కంటే భారత్ కు మెరుగైన పాయింట్స్ ఉండటంతో భారత్ పసిడి పతకం నెగ్గింది. అఫ్గానిస్తాన్ సిల్వర్ మెడల్ దక్కించుకుంది. వాన జోరున పడటంతో మళ్లీ ఆట మొదలుపెట్టేందుకు సాధ్యపడలేదు. దీంతో ఫలితం తేలకుండానే ఫైనల్ రద్దయింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా స్వర్ణ పతకం సాధించింది. అఫ్గాన్కుత రజతం దక్కింది. ఇక, కాంస్య పతకం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్లోస పాకిస్థాన్పైమ బంగ్లాదేశ్ గెలిచింది.
నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి భారత్ Asia
ఈ ఆసియా గేమ్స్ లో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్ను 23 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 96 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. భారత్ తరఫున రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన చేశారు. తిలక్ వర్మ అజేయ అర్ధసెంచరీతో చెలరేగాడు. ఆఫ్ఘనిస్థాన్ ఈ ఆసియా గేమ్స్ లో అద్భుతమే చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది పరుగుల తేడాతో శ్రీలంకకు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు సెమీస్లో పాకిస్థాన్ను 4 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ క్రీడల్లో ఇప్పటికే భారత మహిళల జట్టు బంగారు పతకం గెలువగా ఇప్పుడు పురుషుల జట్టు కూడా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ఇండియా అడుగుపెట్టిన తొలిసారే బంగారు మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి. కబడ్డి ఫైనల్లోత 33-29 తేడాతో ఇరాన్ను ఓడించిన భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్గాగ నిలిచింది. నేడు భారత మహిళల కబడ్డీ టీమ్ కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇక ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. భారత్ పతకాల సంఖ్య ఇప్పటికే 100 దాటింది. భారత్ తొలిసారి ఈ అదుదైన ఘనత సాధించింది. ఇప్పటికే 6 స్వర్ణాలు ఖరారయ్యాయి. క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్, కబడ్డీలోనూ భారత్కు స్వర్ణాలు దక్కాయి. ఇప్పటివరకూ భారత్కు 105 పతకాలు రాగా వీటిలో 28 స్వర్ణాలు, 36 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. Asia