తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించిన తర్వాత తొలిసారి అమిత్ షా తో భేటీ అయ్యారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కొనాలన్న దానిపై ఇరువురు చర్చించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర మంత్రివర్గంలో…
దీంతో పాటు బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కిషన్ రెడ్డి స్థానంలో ఒకరిని తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాల్సిన వారిలో బండి సంజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే బండి మంత్రి పదవికి విముఖత చూపారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీలో ఈ అంశం కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.