తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తప్పించడంతో బండి సంజయ్ హర్ట్ అయ్యారు. ఆయనను త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావించింది. అయితే ఈ ప్రతిపాదనకు బండి సంజయ్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాను కేంద్ర మంత్రివర్గంలో చేరబోనని, సాధారణ పార్టీ కార్యకర్తగానే ఉంటానని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారన్ని బట్టి తెలిసింది.
నచ్చ చెప్పే ప్రయత్నం…
పార్టీ హైకమాండ్ ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా బండి సంజయ్ మాత్రం ససేమిరా అని చెప్పారట. తనకు ఏ బాధ్యతలను పార్టీ అప్పజెప్పినా నిర్వహిస్తానని, అంతే తప్ప కేంద్ర కేబినెట్ లో మాత్రం చేరబోనని ఆయన పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ నుంచి తప్పించనున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న విధానం అమలులో భాగంగా ఆయనను తప్పించి, కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ బండి సంజయ్ అందుకు విముఖత చూపడంతో మరొకరికి ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Follow Us On : YouTube , Google News