టీ తాగడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. చాలా మందికి తెల్లవారగానే ముందుగా టీ తాగడానికే ఆసక్తి చూపుతుంటారు. టీ తాగనిదే అసలు రోజే గడవనట్లు కొంతమంది , మరి కొందరయితే రోజు కి 2 3 సార్లు టీ తాగుతుంటారు . సాధారణం గా అందరూ టీ లో కి బిస్కెట్ మంచి కాంబినేషన్ అని టీ తో మాటు బిస్కెట్ తింటుంటారు ఆలా చాలా మంది చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఛాయ్ బిస్కెట్ వేసుకొని తింటుంటారు. అయితే అలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
టీతో పాటు బిస్కెట్ తినడం అంటే వివిధ రకాల వ్యాధులకు స్వాగతం చేప్పినట్టే అని నిపుణులు చెబుతున్నారు . బిస్కెట్స్ తయారీ లో షుగర్ వాడుతుంటారు అలాగే మనం టీ లో కూడా పంచదార ని కలుపుతుంటాము . ఈ రెండిటి ని కలిపి తీస్కోవడం వల్ల షుగర్ స్థాయిలు పెరిగిపోతాయని దాని వలన ఇన్సులిన్ హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయ్యి డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు , అలాగే ఈ కాంబినేన్ వలన మలబద్ధకం, హైపర్ టెన్షన్ ముప్పు కూడా వచ్చే ప్రమాదం ఉందని, అంతే కాకుండా గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. అందు వలన వీలైనంత వరకు ఛాయ్ బిస్కెట్ రెండు కలిపి తినకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు .