Sleeping pills
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల ఆరోగ్యం మరింతగా దెబ్బతింటోంది. దీంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. కానీ, ఉద్యోగం, పనులు, మానసిక ఇబ్బందుల వల్ల కొంతమందికి నిద్ర సరిగా ఉండదు. దాన్ని కారణంగా నిద్ర మాత్ర వేసుకుంటారు. తరచూ ఇవి వాడటం వల్ల అదే అలవాటుగా మారుతుంది. కానీ నిద్ర మాత్రలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఒక్క నిద్ర మాత్ర వేసుకుంటే చాలు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ దీని వల్ల నిద్రపడుతుందేమో కానీ భవిష్యత్తులో ఎన్ని సమస్యలు వస్తాయి. స్లీపింగ్ పిల్స్ తరచూ వేసుకుంటే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది.
మతిమరపు… Sleeping pills
నిద్రమాత్రలు బ్రయిన్, నాడీవ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపి, ఆందోళనను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి. వీటి వాడకం ఎక్కువైతే పగలు కూడా నిద్ర ముంచుకొస్తున్నట్లు, బద్దకంగా అనిపించడం, తల తిరగడం, అయోమయం, చూపు మసకబారడం, తలంతా పట్టేసినట్లు ఉండడం, మానసిక ఆందోళన అంతలోనే ఉద్వేగం వెంటనే ఆనందం ఇలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మెదడు పని తీరు కూడా క్రమ క్రమంగా నెమ్మదిస్తుంది. చిన్న వయసులోనే మతిమరుపు, ఆలోచనా శక్తి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్రమాత్రలు ఎక్కువసేపు తీసుకోవడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అనేక హాని కలుగుతుంది.
గుండె సమస్యలు… Sleeping pills
నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలేర్పడటం, తలనొప్పి, గుండెలో మంట, కడుపునొప్పి, ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించడం, అలసట, బలహీనంగా అయిపోవడం, మొదలైన సమస్యలు వస్తాయి. తరచూ స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
చనిపోయే ప్రమాదం…
కొంతమంది డాక్టర్ సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతుంటారు. అది అలవాటుగా మారితే ఆ డోస్ మన శరీరానికి సరిపోతు. ఎక్కువ డోస్ వేసుకుంటే గానీ నిద్రపట్టదు. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియలో భాగంగా ఒత్తిడి ఏర్పడి కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎక్కువ నిద్ర మాత్రలు తీసుకుంటే, అది మిమ్మల్ని కోమా దశలోకి వెళ్లేలా చేస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండటం మంచిది.
రక్తం గడ్డకట్టడం…
నిద్ర మాత్రలు నిరంతర ఉపయోగం మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీరు క్రమం తప్పకుండా నిద్ర మాత్రలు తీసుకుంటే ఇది మీ నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇది నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు దీని వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కూడా ఏర్పడతాయి. అలాగే గర్భం దాల్చిన తర్వాత కొంతమందికి నిద్ర పట్టదు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వేసుకోకూడదు. నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయకూడదు.
ఇవి ట్రై చేయండి….
మంచి నిద్ర రావడానికి నిద్ర మాత్రలు మాని నేచురల్ పద్ధతులు పాటించడం చాలా మంచిది. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి.అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ను దూరంగా పెట్టడం మంచిది. రాత్రి పూట గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది. నిద్రపోయే ముందు చేతులతో అరికాళ్లను ఆముదం లేదా నువ్వుల నూనె, కొబ్బరి నూనెతో మర్దన చేస్తే మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది.