సాధారణంగా మనకు ఎవరి వలనైనా భాధ కలిగితే వారి గురించి పక్కన వారితో లేదా మనుసులో అయినా వారి గురించి చెడు గా అనుకుని భాధపడుతుంటాము. కానీ శ్రీ కృష్ణుడు భగవద్గీత లో ఈ 6 గురిని ఎట్టి పరిస్థితులలో నిందించడం కానీ వారి గురించి చేదుగా మాట్లాడడం కానీ చెయ్యకూడదని చెప్పాడట. శ్రీ కృష్ణుడు భగవద్గీత (Bhagavad Gita) లో 6 గురించి వ్యక్తులు గురించి చెప్పి వీరిని అవమానించిన,నిందించిన వారి గురించి చెడు గా మాట్లాడిన వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నట్టు అని అంతేకాకుండా వారికి మహా పాపాలు చుట్టుకుంటాయని చెప్పారట.
ఇంతకీ కృష్ణభగవానుడు చెప్పిన ఆ 6 గురు వ్యక్తులు ఎవరో మీకు తెలుసా..?
దేవతలు :
సాధారణంగా భగవంతుడిని ఏదైనా కోరిక కోరి అది తీరానప్పుడు కోపం తో నో బాధతో నో దైవ నింద చేస్తుంటారు. మరికొందరు దేవుని మీద విశ్వాసం లేని వారు అంటే నాస్తికులు దేవుని గురించి చెడు గా మాట్లాడుతుంటారు.మనల్ని సృష్టించిన భగవంతునికి మనకు ఏది ఇవ్వాలో తెలియదంటారా..! ఇది తెలియక కొంతమంది దైవ నింద చేస్తుంటారు అటువంటి వారు నశిస్తారు అని శ్రీ కృష్ణుడు భగవద్గీత (Bhagavad Gita) లో చెప్పారట. కాబ్బట్టి దేవతలను నిందించడం కానీ, చెడుగా మాట్లాడటం కానీ చెయ్యకూడదట.
వేదాలు:
వేదాలను ఎవరు కూడా నిందించడం,అవమానించడం చెయ్యకూడదట ఎందుకంటే వేదాలు పురాణాల ప్రకారం ఎంతో గొప్ప గ్రంధాలుగా చెప్పబడింది. వేదాల ను సాక్షాత్తు ఆ శ్రీ విష్ణువు చేజారిపోకుండా మశ్చ్యవతారం లో కాపాడి తీస్కోచ్చారు. అంతటి పవిత్రమైన గ్రంధాన్ని గౌరవించాలి తప్ప చేదు గ మాట్లాడకూడదు అని భగవద్గీత లో ఉందని పెద్దలు చెబుతున్నారు.
గోమాత :
గోవు లో సకల దేవతలు కొలువైయుంటారని మన నమ్మకం.కావును ఒక్క గోవు ను సేవిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టు అని పెద్దలు చెబుతుంటారు. అంటువంటి గోవులను స్వార్ధానికి వినియోగించకుండా వాటిని రక్షిస్తూ, సేవిస్తే మంచి ఫలితాలు పొందవచ్చట. అదే గోమాతను బాధించిన,అవమానించిన,నిందించిన అందుకు తగ్గ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భగవద్గీత (Bhagavad Gita) లో చెప్పబడిందట.అందుచేత గోమాత ను తల్లి ల గౌరవించాలట.
బ్రాహ్మణులు:
పురాణాల్లో ని కొన్నిగ్రంధాల ప్రకారం బ్రాహ్మణులూ దేవుని నోటి జన్మించారని విశ్వసిస్తారట. అంతేకాకుండా భక్తుల కోరికలను ప్రార్థనలను భగవంతునికి చేరుస్తారని పెద్ద చెబుతుంటారు.వారి గురించి చేదుగా మాట్లాడటం మంచిది కాదని,బ్రాహ్మణా నింద మహా పాపం అని భగవద్గీత (Bhagavad Gita) లో చెప్పబడిందట.
మతం:
భారత దేశం లో ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతం వారికి ఆ మతం అంటే ఇష్టం మరియు గౌరవం ఉంటాయి.అసలు మతం గురించి అవగాహనా లేని వారు మతం అంటే ఏమిటో తెలియనివారు ఇతర మతాలను అవమానిస్తూ చేదుగా మాట్లాడుతున్నారు.ఆలా ఎన్నటికీ చెయ్యకూడదని భగవద్గీత (Bhagavad Gita) లో శ్రీ కృష్ణుడు చెప్పారు.
మహర్షి:
తపఃసంపన్నులైన మునీశ్వరుల గురించి చేదుగా ఎన్నటికీ మాట్లాడకూడట. దేవూతాలు తరువాత అంతగా పూజ్యనీయులు ఋషులు అంటారు పెద్దలు. అంటువంటి వారికి మనకు చేతనయినా సహాయం చెయ్యాలి తప్ప వారిని అవమానించకూడదు అని భగవద్గీత (Bhagavad Gita) లో చెప్పబదినది. ఋషుల ఆశీర్వాదం ఎంత గొప్పదో వారికి కోపం కలిగించేలా చేతిషే వారి నుంచి వచ్చే శాపాలు కూడా అంతే శక్తివంతమైనవి. కాబ్బటి మహర్షులను గౌరవించి వారి నుండి ఆశీర్వాదం చేసుకోవాలట.