Bharat ratna
తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర అభిలాషి అయిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా సాగాయి. ఇప్పుడు వాటి ముగింపు వేడుకలు కూడా అట్టహాసంగా జరుగుతున్నాయ్.. ఆయనకు భారత రత్నBharat ratna రావాల్సి ఉండగా.. కొన్ని అజ్నాతశక్తులు అడ్డుపడుతున్నాయని విన్నాం.. ఇప్పుడు ఆయన స్మారకార్ధం విడుదలైన వంద రూపాయల నాణెం తో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ కు భారత రత్న రావాలంటే చిన్న మెలిక ఉందన్నది టీడీపీ తటస్థ సీనియర్లు చెప్పే మాట.. భారత రత్న లాంటి అత్యున్నత పురస్కారం మరణానంతరం ఆయనకు దక్కుతుంది కాబట్టి ఆయన భార్యగా లక్ష్మీ పార్వతికి ప్రభుత్వం ఆ పురస్కారం ఇవ్వాల్సి ఉంటుంది. భార్య మరణించిన పక్షంలో మాత్రమే వారసులు ఆ పురస్కారం తీసుకోడానికి అర్హులు.. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో, ఎన్డీ ఏలో భాగస్వామిగా ఉండి కూడా భారత రత్న కోసం క్రుషి చేయలేదు.. ఇంకా ఆనోటా ఆనోట విన్న మాట ప్రకారం ఆయనే దానిని ఉద్దేశ పూర్వకంగా ఆపారన్నది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట.
ఎన్టీఆర్ కు భారత రత్న రాకుండా చంద్రబాబే అడ్డుకుంటున్నారని లక్ష్మీ పార్వతి అనేక సార్లు నోరు పారేసుకున్నారు కూడా.. కేంద్రం ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నా.. లక్ష్మీపార్వతి ఆ పురస్కారం తీసుకోవడం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే ఈ అత్యున్నత పురస్కారం కోసం సీరియస్ గా ఎప్పుడూ ట్రై చేసినది లేదు. సాధారణంగా ఎన్టీఆర్ పేరున ఏ కార్యక్రమమైనా ఆయన భార్య లక్ష్మీ పార్వతిని ఆహ్వానించి చేయాలి.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఈ చేదు నిజం రుచించకపోయినా.. ఎన్టీఆర్ బతికున్నంత కాలం ఆమెను ఆయన భార్యగా గుర్తించి తీరక తప్పలేదు.
నాణెం సరే..మరి భారత రత్న? Bharat ratna
ఇక లక్ష్మీ పార్వతిని కుటుంబ సభ్యురాలిగానే గుర్తించని పురందరేశ్వరి, భువనేశ్వరి ఇప్పుడు వంద రూపాయల నాణెం విడుదల ఫంక్షన్ కు కూడా ఆమెకు ఆహ్వానం లేకుండా జాగ్రత్త పడ్డారు. గతంలో పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీ ఆర్ విగ్రహం పెట్టినప్పుడు కూడా ఆమెకు ఆహ్వానం లేదు.అయినా చివరి నిమిషంలో తెలుసుకుని ఆమె ఢిల్లీ వెళ్లి తెలిసిన టీడీపీ నేతల ద్వారా ఆవేడుకలో పాల్గొనేందుకు లోపలికి వెళ్లగలిగారు. ఆ సమావేశానికి వచ్చిన ఫరూక్ అబ్దుల్లా లాంటి సీనియర్లు ఒకరిద్దరు ఆమెను పలకరించారు కూడా.. అదే సమావేశంలో పాలు పంచుకున్న పురందరేశ్వరి, చంద్రబాబు మాత్రం చూసీ చూడనట్లు ఉండిపోయారు.ఆ సంఘటన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు రాష్ట్రపతి భవన్ సాంస్క్రుతిక కేంద్రంలో ఇవాళ జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి కూడా అదే పద్ధతి అనుసరించింది ఎన్టీఆర్ కుటుంబం.
అయితే ఇప్పుడు ఇదే పెద్ద రచ్చగా మారింది. ఈ కార్యక్రమానికి తనను పిలవలేదంటూ లక్ష్మీ పార్వతి కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిపై వివరణ ఇచ్చాయి. ఇది ఎన్టీఆర్ కుటుంబం నిర్వహించుకుంటున్న పూర్తి ప్రైవేటు ఫంక్షన్ అని దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని, దీనికి రాష్ట్రపతిని అతిథిగా ఆహ్వానించారనీ తెలుస్తోంది. రాష్ట్రపతి బయట సమావేశాలకు రావాలంటే ప్రోటోకాల్, భద్రతా కారణాలుంటాయి కాబట్టి ఈ వేడుకను రాష్ట్రపతి భవన్ సాంస్క్రుతిక కేంద్రంలో ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా మనసుంటే మార్గం ఉంటుంది. ఓ వైపు లక్ష్మీపార్వతి వైసీపీలో చేరి పదవి పొందడం, వైసీపీ నేతలు కూడా ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేసి వెన్నుపోటు దారుగా చంద్రబాబును విమర్శించడంతో ఎన్టీఆర్ కుటుంబం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమైపోతోంది. ఈ మొత్తం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అంతా దగ్గుబాటి పురంధరేశ్వరేనని కూడా తేలింది.
పురంధరేశ్వరి డైరక్షన్ ఓకేనా?
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఇప్పటికే వైసీపీపై ధ్వజమెత్తుతున్న పురంధరేశ్వరి ఈ తాజా స్టెప్ తో వైసీపీతో అమీ తుమీకి,
అందులో ఉన్న లక్ష్మీ పార్వతికి ఝలక్ ఇచ్చేందుకే ఈ స్కెచ్ వేశారన్నది సుస్పష్టం.. దీనిని బట్టి ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారం కూడా ఈ కుటుంబం పూనుకుంటే వస్తుంది.. ఆపితే ఆగుతుంది అన్నది అర్ధమవుతోంది. వైసీపీ కి బీజేపీకి ప్రస్తుతం టెర్మ్స్ బానే ఉన్నా.. పురంధరేశ్వరి వచ్చాక సీన్ మారేలా కనిపిస్తోంది. అయితే పురంధరేశ్వరి నిర్ణయాలను బీజేపి ప్రోత్సహి స్తుందా? లేక నియంత్రిస్తుందా అన్నది కాలమే తేల్చాలి. ఇప్పు డైతే టీడీపీకి మేలు చేయడానికే పురంధరేశ్వరి ప్రయత్నించి ఏపీలో బీజేపీని చంపేస్తున్నారంటూ వైసీపీ గట్టిగానే ప్రచారం చేస్తోంది.