ఢిల్లీలో మరో దారుణ హత్య కలకలం రేపింది. మహిళ శరీర భాగాలను వేరు చేసి రెండు ప్రదేశాల్లో పడేశారు. శ్రద్ధావాకర్ హత్య ఉదంతం మరవక ముందే ఢిల్లీలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. శ్రద్ధావాకర్ ను కూడా ఆమె ప్రియుడు శరీరభాగాలను ముక్కలుగా కోసి అతి కిరాతకంగా నరికి చంపాడు. తాజాగా దొరికిన మహిళ శరీర భాగాలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో దర్శనమివ్వడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.
శరీరభాగాలను…
యమునా ఖాదర్ ప్రాంతం గీతాకాలనీ ఫ్లైఓవర్ సమీపంలో మహిళకు చెందిన శరీరభాగాలు లభ్యమయ్యాయి. మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. హత్యకు గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ శరీరభాగాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. హత్యకు గురైన మహిళ వయసు 35 ఏళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉంటుందని చెబప్పారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.