మంత్రి కేటీఆర్ను బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ సూటిగా ప్రశ్నించారు. ఆయన ట్వీట్ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములను విక్రయిస్తుంటే ఆందోళన చేసిన మీరు ఈరోజు అడ్డగోలుగా ఎలా ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములను విక్రయించవద్దంటూ కేటీఆర్ ఆందోళన చేసిన ఫొటోను ఆయన జత చేశారు.
పేదల భూములకు…
ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవి గుర్తుండవా? అంటూ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు అయినా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా అని మీ నాన్న గారి మాటల్లోనే తాను కూడా అడుగుతున్నానని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల భూములకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. వందల కోట్లను కేసీఆర్, కేటీఆర్ లు బినామీలు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.