New Delhi: దేశంలోని వివిధ ముఖ్యమైన చిన్న పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీ పెంచి మధ్య తరగతి సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం చేరువ చేయాలన్న ఆశయంతో 2016 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ UDAN (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకాన్ని ప్రారంభించారు.
UDAN పథకం ద్వారా విమాన కంపెనీలు తమ ఎయిర్ ఫ్లీట్ లోని చిన్న విమానాలను దేశంలోని వివిధ చిన్న పట్టణాల మధ్య షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్లైన్స్ (SCA) నడపాల్సి ఉంటుంది. ప్రతి వారం ఈ షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్లైన్స్ (SCA) తమ విమానాలలోని కొద్ది సీట్లని సబ్సిడీ ధరలకే ప్రయాణికులకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ SCA విమానాల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఉదాన్ పథకం లో ముందుగా నిర్ణయించిన ఫార్ములా ప్రకారంగానే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను సదరు షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్లైన్స్ (SCA) క్లెయిమ్ చేసుకోవచ్చు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) నిధులు సమకూర్చుకోవడానికి షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ (AIR INDIA, INDIGO) కొద్ది పాటి నగదును రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS) కు చెల్లించాల్సి ఉంటుంది.
2016 లో ప్రారంభమైన UDAN పథకంలోని అనేక లోపాలను ఎత్తి చూపుతూ తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) నివేదికను విడుదల చేసింది. షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్లైన్స్ అయినటువంటి అలయన్స్ ఎయిర్ (ఒకప్పటి ఎయిర్ ఇండియా గ్రూప్ కంపెనీ) రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS) కు తక్కువ చెల్లింపులు చేయడం తో పాటుగా దాదాపుగా రూ. 31 కోట్ల అదనపు యబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ని క్లెయిమ్ చేసుకుందని అలాగే తన ప్రయాణికుల నుంచి అదనంగా రూ.49 లక్షల చార్జీలను వసూలు చేసిందని ఆడిటర్ జనరల్ తన నివేదికలో పేర్కొంది.
UDAN పథకంలో భాగంగా దేశంలోని 116 విమానాశ్రయాలు మరియు హెలిప్యాడ్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా వాటిలో ఇప్పటివరకు 83 విమానాశ్రయాలు పూర్తికాకపోవడంతో దాదాపుగా రూ. 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆడిటర్ జనరల్ స్పష్టం చేసింది. UDAN లో భాగంగా కేంద్రం ఎయిర్లైన్ సంస్థలకు 774 విమాన మార్గాలు నిర్దేశించగా వాటిలో కేవలం 371 రూట్లలో మాత్రమే విమాన సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని మరియు కార్యకలాపాలు ప్రారంభం అయిన 371 రూట్లలో కూడా నేటికి కేవలం 112 రూట్లలో మాత్రమే విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని CAG నివేదికలో పేర్కొంది.
93% రూట్లలో పని చేయని UDAN పథకం
ఉడాన్ పథకంలో జరిగిన అవకతవకల పై శనివారం కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఉడాన్ పథకం 93% రూట్లలో పని చేయట్లేదని కేంద్రం పై విరుచుకుపడింది. ఈ పథకంలో పారదర్సకత్వం లేకపోవడం పై విపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ, విమానాల సంస్థల పై స్వతంత్ర ఆడిట్ లేకపోవడం మరియు ఎక్కువగా ప్రచారం చేసిన హెలికాఫ్టర్ సేవలు కూడా ప్రారంభం కాకపోవడం పై ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం లో ‘ఉడాన్’ (విమానాలు) రాలేదు, కేవలం అబద్ధాలు మరియు జుమ్లాలు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేసారు.
मोदी सरकार का हवाई चप्पल पहन, हवाई सफ़र करने का वादा उनके हर वादे की तरह हवा-हवाई हो गया !
ये हम नहीं कह रहें हैं, CAG Report कह रही है !
🛬योजना 93% routes पर नहीं चली।
🛬Airlines का independent audit भी नहीं हुआ।
🛬बहुप्रचारित Helicopter services भी ठप्प रही।
नहीं मिली… pic.twitter.com/I3bWh6CRke
— Mallikarjun Kharge (@kharge) August 19, 2023