జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదయింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ సురేష్ ఈ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వాలంటీర్ ఫిర్యాదుతో…
ఐపీసీ 153, 153 ఎ, 505(2) సెక్షన్ల కింద పవన్ కల్యాణ్ పై కేసు నమోదు చేసినట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు. తమను కించపర్చడమే కాకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ గౌరవానికి పవన్ భంగం కలిగించారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. వరసగా నాలుగో రోజు కూడా పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏపీ అంతటా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. పవన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు.