జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరగాలంటే తగినంత మంది సిబ్బంది అవసరమని తెలిపింది. పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. ఒకేసారి ఇంత పెద్దస్థాయిలో ఎన్నికలు జరపడం కూడా అసాధ్యమని తెలిపారు.
రాజ్యాంగ సవరణ…
జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకోసమే ఇప్పట్లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయం తగ్గించాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే అయినా నిర్వహణ, సిబ్బంది కొరత వంటి సమస్యల కారణంగా నిర్వహించలేకపోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.