modi
అందాల జాబిల్లి అందిన రోజిది.. చందమామపై పట్టును సాధించిన సందర్భమిది..చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. యావత్ భారత దేశం ఆశలను మోసుకెళ్లిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ థ్రువంపై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఈవిజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది యావత్ భారత దేశం విజయమని, చరిత్రపుటల్లో భారత్ తన విజయాన్ని నమోదు చేసిందని ప్రకటించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియచేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో ఉన్న మోడీ modi అక్కడినుంచే ఇస్రో శాస్త్రవేత్తలకు ఆన్ లైన్ లో కనెక్ట్ అయ్యారు. చరిత్రాత్మక చంద్రయాన్ ప్రాజెక్ట్ సక్సెస్ ను అక్కడినుంచే వీక్షించారు. ఈ క్షణం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానన్నారు.అమ్రుత కాలంలో ఈ విజయం సాధించామని తన జన్మ ధన్యమైందనీ ప్రధాని అన్నారు. ఇప్పటి వరకూ చంద్రుడి దక్షిణ థ్రువంపై ఏ దేశమూ చేరుకోలేదని, భారత్ ఈ విజయంతో సరికొత్త చరిత్ర స్రుష్టించిందని అన్నారు. ల్యాండర్ చంద్రునిపై దిగిన వెంటనే మోడీ జాతీయ జెండాను ఊపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 140 కోట్లమంది భారతీయుల విజయమిది అని ప్రకటించారు.
ఇస్రోలో హర్షాతిరేకాలు… modi
అంతకు ముందు సరిగ్గా 6.04 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ సురక్షితంగా దిగింది. ఈ విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఒక్కసారిగా బల్లలు చరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.. లేచి ఒకరినొకరు కౌగలించుకుని, అభినందనలు తెలియ చేసుకున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తిరంగా జెండా రెపరెపలతో అంతరిక్ష రంగంలో భారత్ ఒక కొత్త విజయాన్ని నమోదు చేసింది. భవిష్యత్తులో మానవ సహిత ఉపగ్రహ ప్రయోగాలే తమ లక్ష్యమని ఇస్రో ప్రకటించింది. ఇకపై సూర్యునిపైనా, శుక్రుడు, అంగారకుడిపైనా తమ ప్రయోగాలు జరుపుతామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఆ17 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠ
అంతకుముందు ఈ ప్రయోగం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఉద్విగ్న క్షణాలను అనుభవించారు. ల్యాండర్ అడుగుపెట్టే ఆ 17 నిమిషాలు ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా అనుకున్న సమయానికే విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై స్థిరంగా శూన్యంలో నిలబడింది. ఆపై నెమ్మదిగా కిందకు దిగింది.. ఆటొమేటిక్ లాండింగ్ సీక్వెన్స్ కమాండ్ అందుకుని ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సాఫ్ట్ గా ల్యాండింగ్ అయ్యింది. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షలా మారిన చందమామ దక్షిణ ధ్రువంపై పాదం మోపి భారత్ చరిత్రను తిరగ రాసింది.15 ఏళ్ల క్రితం చంద్రయాన్ ప్రాజెక్ట్ తో చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పినది భారత్.ఇప్పు డు చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారిలో వెళ్లి ఇప్పటి వరకూ అగ్రరాజ్యాలు చూడని దక్షిణ ధ్రువం జాడని కనుగొంది భారత శాస్త్రవేత్తల బ్రుందం. శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో భారత్ ఇక అజేయంగా దూసుకుపోతుందన్న నిజం ఇవాల్టి సక్సెస్ తో రుజువయ్యింది.
గుడ్ ఫర్ ఇండియా అన్న మస్క్
మరోవైపు ఈ విజయంపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ఇది భారత్ సాధించిన విజయం .. ఇది గుడ్ ఫర్ ఇండియా అని ట్వీట్ చేశారు. మస్క్ ట్వీట్ కు చాలా మంది నెటిజన్లు థాంక్స్ చెప్పారు.అంతరిక్ష ప్రయోగాల కోసమే స్పేస్ ఎక్స్ మిషన్ ను మస్క్ ప్రారంభించారు.టెస్లా కోసం ఎందరో భారత ఇంజనీర్లు పనిచేస్తున్నారని అందువల్ల మస్క్ కూడా భారత్ తో కలసి పనిచేయాలని కోరారు.